తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు రామలింగయ్య ప్రస్థానం ఓ చరిత్ర. ఆయన వారసుడిగా అల్లు అరవింద్ నటుడు కాకపోయినా అగ్ర నిర్మాతగా మారి తెలుగు, తమిళ, హిందీలో ఎన్నో ఘనమైన చిత్రాలు నిర్మించారు. బావ చిరంజీవితో ఎన్నో బ్లాక్ బస్టర్లు తీశారు. మేనల్లుడు రామ్ చరణ్ తో తీసిన మగధీర ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు సృష్టించింది. అలా కొణిదెల కుటుంబంతో అల్లు కుటుంబం బంధుత్వంతో పాటు సినీ ప్రయాణం కూడా దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతోంది.
ఇప్పుడీ రెండు కుటుంబాల సినీ బంధం మరో తరానికి కూడా కొనసాగబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ తెలిపారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ‘బాక్సర్’ సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్ఫణలో అల్లు బాబీ నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు. ఈరోజు వరుణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా బాబీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘వరుణ్ తేజ్ నన్ను నిర్మాతగా పరిచయం చేయబోతున్నాడు. అల్లు – కొణిదెల కుటుంబాల బంధం మరో తరంలో కూడా కొనసాగబోతోంది, మెగా ఫ్యామిలీ.. ఎప్పటికీ’ అని రాసుకున్నాడు బాబీ. . బాబీ ఇప్పటివరకే సినీ పరిశ్రమలో అడుగుపెట్టలేదు. ఇప్పుడు వరుణ్ సినిమాతో తొలిసారి సినీ ప్రయాణం మొదలు పెట్టబోతున్నారు.
అల్లు అరవింద్ కుమారులు ముగ్గురిలో అర్జున్ స్టార్ హీరోగా, శిరీష్ హీరోగా కొనసాగుతున్నాడుఅల్లు – కొణిదెల కుటుంబాల మధ్య గ్యాప్ వస్తోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ఫ్యాన్ వార్ కు బాబీ ఓరకంగా ఫుల్ స్టాప్ పెట్టినట్టైంది. వరుణ్ తేజ్ సినిమాను బాబీ నిర్మిస్తున్నాడు. బన్నీ గత సినిమా నాపేరు సూర్య.. సినిమాకు నాగబాబు ఓ నిర్మతగా వ్యవహరించాడు. ఇది గమనించైనా ఫ్యాన్స్ అర్ధంపర్ధం లేని వార్ కు తెరదించుతారేమో చూడాలి.
View this post on InstagramVarun Tej Kondidela ... has decided to launch me as a producer . The Allu and konidela connection continues into the next Generation . #familyfirst❤️ #allu #Konidela #megafamily #forever 🙏