నేను శైలజా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన బ్యూటీ.. కీర్తి సురేష్.. ఆ తర్వాత  నేను లోకల్ సినిమా ద్వారా మరో సారి ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.. కాగా సినిమాజోష్ పెంచిన ఈ అమ్మడు ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది.. కొంచం ఈ మధ్య రూట్ మార్చింది..


'మహానటి' సినిమాతో జాతీయస్థాయి గుర్తింపు తెచ్చుకుంది అందాల భామ కీర్తిసురేష్. కీర్తి 'మహానటి' సినిమా తర్వాత చాలా జాగ్రత్తగా కథలను ఎంచుకుంటుంది. ఏది పడితే అది చేయకుండా ఆచి తూచి అడుగులు వేస్తుంది. తాజాగా బాలీవుడ్ లో కీర్తికి అవకాశమొచ్చింది. కానీ అనుకోకుండా ఆ ఆఫర్ చేయిజారిపోయింది. 


అసలు విషయానికొస్తే...అందుకు కారణం కూడా కీర్తి సన్నబడటమే దాంతో ఆ ఆఫర్ మరో భామ తన్నుకుపోయింది. 
అసలు విషయం ఏంటంటే బాలీవుడ్ లో అజయ్ దేవగన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ముందుగా కీర్తి సురేష్ ను అనుకున్నారంతా అయితే కీర్తి ఈ మధ్య లావు తగ్గి సన్నగా అయింది. 


అయితే సినిమాలో అజయ్ కు భార్యగా నటించాలి దాంతో అజయ్ దేవగన్ పక్కన కీర్తి మరీ చిన్న పిల్లలా కనిపిస్తుందట దాంతో కీర్తి ప్లేస్ లో ప్రియమణి ని ఎంపిక చేసారంట అజయ్ పక్కన ప్రియమణి సరిగ్గా సరిపోవడంతో ప్రియమణి కీర్తి ప్లేస్ ను కొట్టేసింది. ఇక ఈ అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నవంబర్‌ 27న ప్రేక్షకుల ముందకు రానుంది. 

 

కీర్తి సురేష్ సన్నబడటానికి కారణం కూడా బాలీవుడ్ వచ్చిన సినిమా ఆపర్.. ఆ సినిమాలో కనిపించాలంటే సన్నబడాలి. అందుకునే అమ్మడు తెలుగు సినిమాలకు దూరంగా ఉండి మరి సినిమాలలో నటిస్తుంది.. బాలీవుడ్ ఆఫర్ మిస్ చేసుకుంది కీర్తి. అయినా కూడా బాలీవుడ్ లో  ఇతర సినిమాలో నటించేందుకు కీర్తికి ఆఫర్లు వస్తున్నాయంట... మరి ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం వస్తుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: