నిన్న సాయంత్రం సాగరతీరం విశాఖపట్నం బన్నీ మ్యానియాతో షేక్ అయింది. టోటల్ పాజిటివ్ టాక్ తో సంక్రాంతి విన్నర్ గా మారిన ఈ మూవీ కలెక్షన్స్  బాక్సాఫీస్‌ ను షేక్ చేస్తున్నాయి. అక్కడ ఇక్కడ అని తేడా లేకుండా అన్ని చోట్లా వసూళ్ల వర్షాన్ని  కురిపిస్తున్న ఈ మూవీ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి రికార్డులను క్రియేట్ చేసిందని ఈ మూవీ నిర్మాతలు చెపుతున్నారు. 

ఈ అనూహ్య విజయానికి జోష్ లోకి వెళ్ళిపోయిన ‘అల’ టీమ్ నిన్న సాయంత్రం విశాఖపట్నం ఆర్ కె బీచ్ లో ఏర్పాటు చేసిన ఈ మూవీ విజయోత్సవ సభ అడుగడుగునా అల్లు అర్జున్ మ్యానియాను ప్రతిబింబించే విధంగా జరిగింది. ప్రత్యేక విమానంలో విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ కు వచ్చిన బన్నీకి అభిమానులు అపూర్వ స్వాగతం ఇవ్వడమే కాకుండా బన్నీ ప్రయాణిస్తున్న కారుకు ముందు వందల సంఖ్యలో అభిమానులు బైక్ లు నడుపుతూ చేసిన బైక్ ర్యాలి అందరి దృష్టిని ఆకర్షించింది. 

ఈ కార్యక్రమం కోసం వచ్చిన తన అభిమానులకు మరింత జోష్ ను కలిగించడానికి బన్నీ తన కారు పైకి ఎక్కి తన అభిమానులతో కలిసి ఈ బైక్ ర్యాలీలో ప్రయాణించడమే కాకుండా దారి పొడుగునా తనను చూస్తున్న వారందరికీ బన్నీ తన స్టైల్ లో అభివాదాలు తెలియ చేసాడు. దీనితో విశాఖపట్నం రాజధాని నిర్ణయానికి సంబంధించిన కీలక ప్రకటన ఇంకా వెలువడ కుండానే బన్నీ మ్యానియాతో విశాఖ తీరం షేక్ అయిపోయింది.

బైక్ ర్యాలీలో అడుగడుగునా కనిపించిన అల్లు అర్జున్ సెన ఫ్లాగ్స్ చూసిన వారికి బన్నీ చాల వ్యూహాత్మకంగా తన మెగా కాంపౌండ్ హీరో ఇమేజ్ నుండి బయటకు వస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానులను ఏర్పరుచుకుని మెగా హీరోల ముసుగు ఇమేజ్ నుండి బయటకు వస్తున్నాడు అన్న స్పష్టమైన క్లారిటీ వస్తోంది. ఈ కార్యక్రమంలో బన్నీ ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వకుండా తన సహజ సిద్ధమైన పంచ్ లతో తన అభిమానులను నవ్విస్తూ తాను సంక్రాంతి రేస్ విన్నర్  అన్న విషయం వ్యూహాత్మకంగా తెలియచేసాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: