ఈ మద్య ఇతర భాష హీరోయిన్ల జోరు టాలీవుడ్ లో బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా కోలీవుడ్ హీరోయిన్లు తెలుగు, తమిళంలో తమ జోరు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే నయనతార, నిత్యా మీనన్ , అమలాపాల్ ఇతర హీరోయన్లు తెలుగు రాణిస్తున్న తరుణంలో కీర్తి సురేష్, సాయి పల్లవి కొత్తగా తమ జోరు కొనసాగిస్తున్నారు. అదృష్టం ఏంటేంటే వీరు నటిస్తున్న సినిమాలు కూడా మంచి విజయాలు అందుకోవడం. ఈ మద్య కన్నడ ఇండస్ట్రీ నుంచి కూడా హీరోయిన్లు వస్తున్నారు. కిర్రాక్ పార్టీతో కన్నడ నాట అడుగు పెట్టిన రష్మిక మందన తెలుగు లో నాగ శౌర్య నటించిన ఛలో మూవీతో మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత గీతాగోవిందం, దేవదాస్, డీయర్ కామ్రెడ్ లో నటించిన ఈ చిన్నది ఈ మద్య మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీతో మరో ఘన విజయం అందుకుంది.
ఈ అమ్మడు నిజంగానే గోల్డెన్ లెగ్ అని అంటున్నారు. ఇక మరో కన్నడ బ్యూటీ నబా నటాష్ ‘నన్ను దోచుకుందువటే’ మూవీతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయ్యింది. ‘ఇస్మార్ట్ శంకర్'తో కమర్షియల్ విజయాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామ ‘డిస్కోరాజా’ మూవీలో రవితేజ సరసన కథానాయికగా నటిస్తున్నది. ఈ మూవీ 24న రిలీజ్ కాబోతుంది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 2019 నాకు ఎన్నో మధురానుభూతుల్ని మిగిల్చింది. కెరీర్పరంగా ఈ సంవత్సరం నాకు ఎంతో ధైర్యాన్ని, ఆనందాన్ని ఇచ్చింది.
ఆ జోష్ నుంచి నేను ఇంకా బయటకు రాలేదు. నేను ఎక్కడకు వెళ్లినా అభిమానులు ‘ఇస్మార్ట్శంకర్' డైలాగులు చెప్పమని అడుగుతున్నారు. రవితేజ నటనను నేను బాగా ఇష్టపడతాను. ఆయనలోని కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ‘విక్రమార్కుడు’ మూవీ బాగా నచ్చింది. సెట్ లో ఆయన చాలా జాలీగా ఉంటారు.. వ్యక్తిత్వపరంగా కూడా ఆయన ఆశావహదృక్పథంతో ఉంటారు. ‘డిస్కోరాజా’ సినిమాలో నేను లోన్స్ వసూళ్లు చేసే బ్యాంక్ ఉద్యోగిగా కనిపిస్తాను. ఈ మూవీ తప్పకుండా హిట్ అవుతుందనే ఆశ ఉందని అన్నారు.