తెలుగు బుల్లితెరపై వస్తున్న కామెడీ ప్రోగ్రామ్ ‘జబర్ధస్త్’ ప్రారంభమై ఇప్పటికీ ఏడేళ్లు అవుతుంది.  అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కామెడీ షోకి ఆదరణ పెరిగిపోతూనే ఉంది.. ఎక్కడా బోర్ కొట్టకుండా.. కొత్త స్కిట్స్ తో తమదైన స్టైల్లో మెప్పిస్తున్నారు  టీమ్ లీడర్లు.  అయితే జబర్ధస్త్ ప్రారంభమైనప్పటి నుంచి మెగా బ్రదర్ నాగబాబు, ఎమ్మెల్యే, నటి రోజా జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు.   తెలుగు టెలివిజన్ చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ఫాలోయింగ్ సంపాదించుకున్న షో 'జబర్ధస్త్'. ఈ కామెడీ షోకి ధీటుగా ఇప్పటి వరకు ఏదీ రాలేదు. యూట్యూబ్‌లో అంతకు రెట్టింపు సంఖ్యలో చూసే అభిమానులున్నారు.   

 

అయితే ఈ మద్య నాగబాబు వేరే ఛానల్ కి జంప్ అయిన విషయం తెలిసిందే.  జీ తెలుగు లో ‘అదిరింది’ అనే కామెడీ షోకి ఆయన జడ్జీగా వ్యవహరిస్తున్నారు.   ఈ షోతో జబర్ధస్త్ కామెడీ పని అయిపోయిందన్న కామెంట్స్ కూడా వినబడ్డాయి.  ఈ షో కోసం నాగబాబు తనతో  పాటు మరికొంత మంది జబర్ధస్త్ నటలును తీసుకువెళ్లడం జరిగింది.  కానీ అందరి ఊహలకు షాక్ ఇస్తూ ‘అదిరింది’ షో కి దిమ్మతిరిగే రేటింగ్ వస్తుంది. తాజాగా విడుదలైన టీఆర్పీ రేటింగులు అదిరింది ప్రోగ్రామ్‌కు గట్టి షాకే ఇచ్చాయి. ఇక ఇటీవల వచ్చిన రేటింగ్స్ చూస్తే.. జబర్ధస్త్‌కు 5 నుండి 6 రేటింగ్స్ వచ్చాయి.

 

ఇక  ‘అదిరింది’కి మాత్రం కేవలం 0.5 రేటింగ్ వచ్చింది. వాస్తవానికి జబర్ధస్త్ కామెడీ షోకి అచ్చు గుద్దినట్లే కాపీ కావడంతో ‘అదిరింది’పై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు తెలుగు ప్రేక్షకులు. వాస్తవానికి జబర్దస్త్ నుండి నాగబాబు బయటకు వచ్చిన తరువాత ఆ ఎఫెక్ట్ తప్పకుండా ఉంటుందని చాలా మంది భావించారు.  కానీ టీఆర్పీ రేటింగ్ చూస్తుంటే పాపం అదిరింది పాయే అంటున్నారు. ప్రస్తుతం జబర్దస్త్ కు వస్తున్న భారీ రేటింగ్స్  చూస్తుంటే కొత్త స్కిట్స్ తో మరింద దుమ్మురేపబోతున్నట్లు తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: