ఆ మద్య అనీల్ రావిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్’ మూవీతో బంపర్ హిట్ అందుకున్న మాస్ మహరాజ రవితేజ ఆ తర్వాత వరుసగా డిజాస్టర్స్ ఎదుర్కొంటున్నారు.  చివరిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘అమర్ అక్బర్ ఆంథోని’ మూవీ అంచనాలు పూర్తిగా తలకిందులు అయ్యాయి. దాంతో రవితేజ తన తదుపరి మూవీ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.  వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ  ‘డిస్కోరాజా’ రూపొందింది.  మూవీ ‘డిస్కోరాజా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు.  ఈ సందర్భంగా సినిమా గురించి రవితేజ ఎన్నో ఆసక్తికర విషయాలు తెలిపారు.

 

అంతే కాదు సినిమాపై ఎంత నమ్మకం ఉందో ఆయన మాటలు బట్టి అర్థం అవుతుంది.  ఈ మూవీ సీక్వెల్ కూడా త్వరలో చూడబోతారని అన్నారు. తమన్ సంగీతం సమకూర్చారు. ఎస్‌ఆర్టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ మూవీ నిర్మించారు. ఈనెల 24న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఈ మూవీ ప్రమోషన్ బిజీలో చిత్ర యూనిట్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా సెన్సారు కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U\A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు.  ఈ మూవీలో రవితేజ సరసన  సరసన నభా నటేశ్, పాయల్తాన్యా హోప్ అలరించనున్నారు.

 

ముఖ్యమైన పాత్రల్లో సునీల్ .. వెన్నెల కిషోర్ కనిపించనున్నారు. రామ్ తాళ్లూరి నిర్మించిన ఈ సినిమాకి తమన్ అందించిన సంగీతం ప్రత్యేకంగా నిలవనుందని అంటున్నారు. రాజా ది గ్రేట్ మూవీ సూపర్ హిట్ తర్వాత రవితేజ వరుస అపజయాలు అందుకుంటున్న విషయం తెలిసిందే.  మాస్ ఎలిమెంట్స్ మూవీస్ కూడా దెబ్బతీశారు. దాంతో ఈసారి విభిన్నమైన కథతో ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నారు.  అయితే  ఈ సినిమాపై రవితేజ పెట్టుకున్న ఆశలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: