బాహుబలితో పాన్ ఇండియన్ హీరోగా ముద్ర పడిపోయాడు డార్లింగ్ ప్రభాస్. గతేడాది సాహోతో వచ్చిన ప్రభాస్ పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు. కానీ బాలీవుడ్ లో మాత్రం మంచి కలెక్షన్లు రాబట్టాడు. ప్రస్తుతం ప్రభాస్ తన నెక్స్ట్ మూవీని రాధాకృష్ణ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాకు టైటిల్ జాన్ గా చెప్తున్నారు. ఈ సినిమాలో తన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా రివీల్ చేశాడు. ఇక్కడే ఓ సమస్య వచ్చిపడింది.

 

 

సినిమాకు వెలుపల సెంటిమెంట్ కు టాలీవుడ్ దర్శక, నిర్మాతలకే కాదు.. అభిమానులకు కూడా మెండుగా ఉంటుంది. ప్రభాస్ సినిమాలో కృష్ణంరాజు నటించడం దీంతో మూడోసారి. ప్రభాస్ విషయంలో ఇప్పుడో సెంటిమెంట్ నే అభిమానులు వ్యక్తపరుస్తున్నారు. గతంలో బిల్లా, రెబల్ సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. దీంతో ఇప్పుడు హ్యాట్రిక్ గా వస్తున్న జాన్ పై అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమాతో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు ప్రభాస్. ఈ సినిమాతో అయినా బౌన్స్ బ్యాక్ కావాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ కృష్ణంరాజు సెంటిమెంట్ ను పట్టించుకోవడం లేదు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాను వచ్చే ఏడాది మేలో రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

 

 

బాహుబలి సిరీస్ తో దేశమంతా ప్రభాస్ పేరు మోగిపోయింది. విదేశీ మార్కెట్ లో కూడా ప్రభాస్ కు మంచి మార్కెట్ వచ్చేసింది. ఎంతగా అంటే ఆమధ్య జపాన్ లో ప్రభాస్ ను ఓ అభిమాని ‘మీరు ఇండియన్ హీరో కదా’ అని గుర్తుపట్టేంత. మరి అభిమానుల సెంటిమెంట్ ప్రభాస్ ఏమేరకు పట్టిచుకుంటాడో చూడాలి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: