టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రస్తుతం తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఇటీవల సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ సాధించిన విషయం తెలిసిందే. అప్పటివరకు ఎక్కుగా మెసేజ్ సినిమాలు చేస్తూ వస్తున్న సూపర్ స్టార్, ఒక్కసారిగా తన పద్దతిని మార్చి సరిలేరు వంటి పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్టైనర్ లో నటించడంతో ఫ్యాన్స్ తో పాటు జనరల్ ఆడియన్స్ కూడా సినిమా చూడడానికి ఆసక్తి కనపరిచారు. ఇక ఇటీవల రూ.100 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గా షేర్ కొల్లగొట్టిన ఈ సినిమా సక్సెస్ తో తాను ఎన్నడూ లేనంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మహేష్. 

 

ఇకపోతే నేడు మహేష్ బాబు ఒక రేర్ ఫీట్ ని అందుకున్నారు. తన సినిమా మరియు వ్యక్తిగత విషయాలు తన ఫ్యాన్స్ తో ఎప్పటికప్పుడు  సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా షేర్ చేసుకునే మహేష్ బాబు, ట్విట్టర్ లో మరింత యాక్టివ్ గా ఉంటూ ఉంటారు. ఇక అదే ట్విట్టర్ లో నేడు 8.8 మిలియన్ల (88,75,298) ఫాలోవర్లతో సౌత్ ఇండియాలోనే ట్విట్టర్ లో అత్యధిక ఫాలోవర్స్ కలిగిన ఏకైక హీరోగా ఒక సంచలన రికార్డు ని నెలకొల్పడం జరిగింది. ఇక ఎప్పుడూ తమ హీరోకు సంబందించిన సినిమా తదితర విషయాలపై ట్విట్టర్ లో ట్రెండ్ సెట్ చేసే సూపర్ స్టార్ ఫ్యాన్స్, 

 

నేడు మహేష్ ఈ అద్భుత రికార్డు అందుకోవడంతో దానిని కూడా ఒక ట్విట్టర్ ట్రెండ్ సెట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. భరత్ అనే నను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు ఇలా వరుసగా మూడు వరుస హ్యాట్రిక్ విజయాలతో మంచి జోష్ మీదున్న సూపర్ స్టార్, నిన్న తన ఫ్యామిలీ తో కలిసి ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేయడానికి ఫారెన్ వెళ్లారు. మరొక రెండు నెలలపాటు అక్కడే గడపనున్న మహేష్, తిరిగి వచ్చిన అనంతరం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. మంచి కమర్షియల్ జానర్ లో మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఆ సినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: