పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ కి పూర్తి పూర్తి స్థాయి హీరోగా ఎంట్రీ ఇచ్చిన యువ నటుడు విజయ్ దేవరకొండ, నిజానికి అంతకముందు పలు సినిమాల్లో అక్కడక్కడా చిన్న పాత్రల్లో నటించడం జరిగింది. ఇక నాని హీరోగా తెరెకెక్కిన ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి మెప్పించిన విజయ్, ఆ తరువాత పెళ్లిచూపులు తో హీరోగా మారి ఫస్ట్ మూవీతోనే బెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన అర్జున్ రెడ్డు సినిమాలో నటించి యూత్ లో మంచి క్రేజ్ పొందిన విజయ్, ఆ సినిమా సక్సెస్ తో టాలీవుడ్ ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. 

 

ఆపై పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం సినిమా సూపర్ సక్సెస్ తో టాలీవడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా మారిన విజయ్, ఇటీవల మాత్రం ఒకింత ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొంటున్నాడు. ఇక ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విజయ్, నిన్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించబోయే సినిమాని ముంబైలో అధికారిక పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు. పూరి, ఛార్మితో కలిసి బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ సొంత సంస్థైన ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా మూవీగా తెలుగు, 

 

హిందీతో పాటు పలు సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎంతో భారీ ఖర్చు తో తెరకెక్కించనున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి కాసేపటి క్రితం తన ట్విట్టర్ ద్వారా ఒక పోస్ట్ పెట్టిన విజయ్, 'పాన్ ఇండియా పిచ్చి - 2020' అంటూ ఒక ట్వీట్ చేసాడు. ఇక ఆ పోస్ట్ పై పలువురు ఆయన ఫ్యాన్స్ స్పందిస్తూ, నువ్వు ఫస్ట్ టైం చేయబోతున్న ఈ పాన్ ఇండియా మూవీ సక్సెస్ కావాలని, అలానే నీ పిచ్చి కూడా తీరిపోవాలని ఒకింత సరదాగా ఆ పోస్ట్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం విజయ్ చేసిన ఆ ట్వీట్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: