మ‌హాన‌టి సావిత్రి జీవిత‌గాధ ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం `మ‌హాన‌టి` నాగఅశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం. ఈ చిత్రంలో కీర్తి సురేష్ సావిత్రి పాత్ర‌లో న‌టించి మెప్పించారు. ఆ చిత్రంతో కీర్తి ఫేమ్ మారిపోయింది. ఇక ఆమె లేడీ ఓరియంటెడ్ చిత్రాల పై మ‌క్కువ చూపుతుంది. బాలీవుడ్ లో ఓ మంచి అవ‌కాశం వ‌చ్చింది. ఆ చిత్రం దాదాపుగా షూటింగ్ కూడా పూర్త‌యిపోయింది. అనుకోకుండా ఆ టీం నుంచి ఆమెకు ఓ ఎదురుదెబ్బ త‌గిలింది. కీర్తి పూర్తిగా సినిమా నుంచి త‌ప్పుకోవ‌ల్సి వ‌చ్చింది. దానికి కార‌ణాలు లేక‌పోలేదు. ఇందుకు ప్ర‌ధాన కార‌ణం కీర్తి బ‌రువు త‌గ్గ‌డం. ఆమె హీరో అజ‌య్‌దేవ‌గ‌న్ కంటే వ‌య‌సులో చాలా చిన్నది కావ‌డం. ఈ సినిమాలో కీర్తి పాత్ర అజ‌య్‌కి భార్య‌గా న‌టించాలి. షూటింగ్ మొత్తం అయ్యాక వీరి జంట‌ని చూస్తే అస‌లు ఎక్క‌డా కూడా వీరి జంట చూడ‌టానికి బాలేద‌ట‌. 


దీంతో ద‌ర్శ‌క నిర్మాత‌లు అమిత్‌ర‌వీంద్ర‌నాథ్, బోనీక‌పూర్‌ కీర్తికి బ‌దులు వేరే న‌టి కావాల‌నుకున్నారు. ఇందుకు కీర్తి కూడా ఎక్క‌డా ఫీల‌వ‌కుండా స‌రే అనేసింద‌ట‌. ఇక ఈమె పాత్ర‌లో ప్ర‌ముఖ నటి ప్రియ‌మ‌ణిని ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. అజ‌య్‌భార్య‌గా ప్రియ‌మ‌ణి అయితే క‌రెక్ట్‌గా ఉన్నార‌ట‌. అయితే ఈ విష‌యాన్ని ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించాల్సి ఉంది. 1950లో భారతీయ ఫుట్ బాల్ టీం కోచ్‌గా వ్యవహరించిన సయ్యద్ అబ్దుల్ రహీం జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నవంబర్ 27న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

 

ఇక ఈ విష‌యం మీద కీర్తి స‌న్నిహితులు ఇటీవ‌లె అధికారికంగా ప్ర‌క‌టించారు. కీర్తి సినిమా నుంచి త‌ప్పుకోలేద‌ని అన్నారు. ఇలాంటి గాసిప్స్ వ‌స్తున్నందుకు ఆమె అభిమానులు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. డైరెక్ట‌ర్ అనేవాడు పాత్ర‌ల‌ను ఎంపిక చేసుకోవ‌డం అనేది ముందుగానే తెలియాల్సిన అంశం షూటింగ్ మొత్తం పూర్త‌య్యాక తెలిసేదేంట‌ని అగ్గిగుగ్గిలం అవుతున్నారు. దీని వ‌ల్ల కీర్తి కెరియ‌ర్‌కి ఇబ్బంది క‌లుగుతుందని. త‌న ఇమేజ్ ఏం కావాలంటూ ప్ర‌శ్నిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: