టాలీవుడ్ లోకి  ఎంట్రీ ఇచ్చిన రష్మిక అనతికాలంలోనే  టాప్ హీరోయిన్స్ సరసన చేరిపోయింది. గీత గోవిందం సినిమా లో విజయ దేవరకొండ సరసన నటించి   సూపర్ డూపర్ హిట్ కొట్టిన తరువాత అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి. ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించే అవకాశం కొట్టేసిన ఈ బ్యూటీ, మహేష్ తో నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమా సక్సెస్ ని సంతోషంగా జరుపుకుంటున్న తరుణంలోనే తన సొంత ఊరు కార్ణాటకలోని కూర్గ్ లోగల ఇంట్లో ఐటీ దాడులు జరిగాయనే వార్తలు రావడంతో షాక్ అయ్యింది..

 

రష్మిక ఇంటిపై జరిగిన  ఈ ఐటీ దాడులలో అధికారులు సుమారు రూ.25 లక్షల విలువైన ఆస్తి పత్రాలు, డబ్బులని, మరిన్ని విలువైన వస్తువులని కూడా స్వాధీనం చేసుకున్నారనే విషయం అందరికి తెలిసిందే.  గత కొన్ని రోజులుగా ఈ విషయంపై సతమతమవుతున్న రష్మిక ఎక్కడా కూడా మీడియా ముందుకు రాకుండా తన మేనేజర్ ద్వారా అన్ని విషయాలు మాట్లాడిస్తోంది. ఈ క్రమంలోనే ఆమె మేనేజర్ ఐటీ దాడులు రష్మిక పై జరగలేదంటూ కొత్త ట్విస్ట్ తెరపైకి తీసుకువచ్చాడు.

 

రష్మిక ఇంట్లో సోదాలు నిర్వహించి కొంత సొమ్ముని, పత్రాలని స్వాధీనం చేసుకున్న సమయంలో ఆమె తండ్రి అధికారులకి ఎటువంటి వివరాలు చెప్పలేక పోయారని, అందుకే సొత్తు సీజ్ చేశామని అధికారులు తెలిపారు.ఈ విషయంపై స్పందించిన రష్మిక మేనేజర్  ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి పట్టుకుంది రష్మిక ఆదాయంపై కాదని ఆమె తండ్రి మదన్ ఆస్తిపై అని ప్రకటించారు. కాగా ఈ నెల 21 న బెంగుళూరు , మైసూర్ ఐటీ కార్యాలయాలకి హాజరయ్యి వీటి  వివరాలు అందించాలని ఆదేశాలు జారీ చేసిన నేపధ్యంలో మేనేజర్ ఈ వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది..ఈ వర్ధమాన హీరోయిన్ పరువు కాపాడాలంటే ఇలాంటి ప్రకటనలు చేయక తప్పదులే అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు..

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: