‘అల వైకుంఠపురములో’ మూవీ విజయోత్సవ సభలో తమన్ మాట్లాడుతూ ‘అల’ మూవీ రికార్డులు మిగతా సినిమాల రికార్డులు లా ఫేక్ రికార్డ్స్ కావని కామెంట్ చేసాడు. దీనితో తమన్ చేసిన కామెంట్స్ ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ కలక్షన్స్ రికార్డుల ప్రచారాన్ని టార్గెట్ చేస్తూ అన్న మాటలు అనీ మహేష్ అభిమానులు తీవ్ర అసహనానికి లోనుకావడమే కాకుండా తమన్ ను టార్గెట్ చేస్తూ చాల నెగిటివ్ కామెంట్స్ చేసారు.

అయితే ఈ విషయాలు అన్నీ ప్రస్తుతం అమెరికాలో ఉన్న మహేష్ దృష్టికి వచ్చినా అవి పట్టించుకోకుండా మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న మూవీకి తమన్ ను సంగీత దర్శకుడుగా ఇప్పుడు ఎంపిక చేయడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. వంశీ పైడిపల్లి మహేష్ ల కొత్త మూవీ ప్రాజెక్ట్ కు సంబంధించి కథ ఫైనల్ కావడంతో ఈ మూవీకి సంబంధించిన సాంకేతిక నిపుణుల ఎంపికలో మొదటిగా తమన్ ఎంపిక పూర్తి అయినట్లు సమాచారం. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీకి సంబందించి పాటల ట్యూన్స్ ఫైనల్ చేసే సిటింగ్ మహేష్ అమెరికా నుండి తిరిగి వచ్చిన తరువాత జరుగుతుంది అని అంటున్నారు. మహేష్ కెరియర్ లో బ్లాక్ బష్టర్ మూవీగా చరిత్ర సృష్టించిన ‘దూకుడు’ సినిమాకు తమన్ ట్యూన్స్ అందించాడు. అయితే ఆ తరువాత ‘ఆగడు’ మూవీ ఫెయిల్యూర్ తరువాత మహేష్ తమన్ ల మధ్య కొంత గ్యాప్ ఏర్పడింది. 

అయితే ఇప్పుడు ఆ విషయాలు అన్నీ పక్కకు పెట్టి ‘అల వైకుంఠపురములో’ మూవీకి తమన్ అందించిన మ్యూజిక్ ఫిదా అయిన మహేష్ పెద్దమనసుతో ఇలా తమన్ కు మరొకసారి అవకాశం ఇస్తున్నాడు అనుకోవాలి. మెసేజ్ ఓరియంటెడ్ మూవీలతో విసిగి పోయిన మహేష్ మరొకసారి పక్కా ఎంటర్ టైన్మెంట్ సినిమాను చేయమని వంశీ పైడిపల్లికి సూచనలు ఇచ్చిన నేపధ్యంలో ఈ దర్శకుడు ఎంత వరకు మహేష్ అంచనాలను చేరుకోగలడో చూడాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: