సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం థియేటర్ల వదద్ పాజిటివ్ టాక్ తెచ్చుకుని వందకోట్ల దిశగా దూసుకుపోతుంది. మహర్షి సినిమా తర్వాత మళ్ళీ ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకునే దిశగా వెళ్తుంది. అయితే ఈ సినిమాతో పాటు పోటీగా వచ్చిన మరో చిత్రం సరిలేరుని దాటుకుని వెళ్ళిపోతుంది. అటు రికార్డుల పరంగానూ సరిలేరు నీకెవ్వరు సినిమాని దాటేసి వెళ్తుంది.

 

 

అయితే ఆ సినిమా అంతలా హిట్ అవడానికి కారణం ఆ సినిమాకి అందించిన సంగీతమే ప్రధాన కారణం. అల వైకుంఠపురములో సినిమా పాటలు సినిమా విడుదలకి ముందే బ్లాక్ బస్టర్ అయ్యాయి. ప్రతీ ఒక్క పాట సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మధ్య కాలంలో ఒక సినిమాలోని అన్ని పాటలు ఇంతలా హిట్ కావడమనేది ఈ సినిమాలోనే అయింది. అయితే అల వైకుంఠపురములో సినిమా విజయంలో సంగీతం పాత్ర చాలా ఎక్కువ.

 

 

అయితే ఆ సినిమాకి మ్యూజిక్ అందించిన థమన్ కి చాలా పేరొచ్చింది. అల వైకుంఠపురములో సినిమాలోని పాటలకి సరిసమానంగా సరిలేరు నీకెవ్వరు పాటలు లేకపోవడం కొంచెం మైనస్ గా మారింది. దాంతో మహేష్ తన తర్వాతి చిత్రానికి థమన్ ని సంగీత దర్శకుడిగా తీసుకోవాలని చూస్తున్నాడట. మహర్షి ఫేం వంశీ పైడిపల్లి ఎంబీ 27కి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ విదేశాల నుంచి టూర్ ముగించుకుని ఇండియా కు తిరిగా రాగనే షూటింగ్ ప్రారంభం కానుంది.

 

 

 

ప్రస్తుతం వంశీ పైడిపల్లి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరి ఈ సినిమాకి థమన్ తీసుకుంటారా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతానికి మహేష్ హాలీడే లో ఉన్నాడు. హాలీడే ముగించుకుని డైరెక్ట్ గా షూటింగ్ ప్రారంభించాలని చూస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: