ఈ ఏడాది సంక్రాంతి కానుకగా టాలీవుడ్ టాప్ హీరోలు మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ నటించిన ‘అల వైకుంఠపురములో’ మూవీస్ బ్లాక్ బస్టర్ విజయాలు అందుకొని భారీ కలెక్షన్ల దిశగా సాగుతున్నాయి.   సరిలేరు నీకెవ్వరు మూవీకి దేవీ శ్రీ సంగీతం అందించారు.  అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో మూవీకి ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు.  థమన్ స్వరపరిచిన ‘సామ జవరగమన, రాములో రాముల’ బ్లాక్ బస్టర్ అయ్యాయి.. యూట్యూబ్ సంచలనాలు సృష్టించాయి.  ఈ సాంగ్స్ తో పోలిస్తే దేవీ అందించిన మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేక పోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్న విషయం తెలిసిందే.  ఈ మధ్య కాలంలో తమన్ హిట్ల మీద హిట్లు కొడుతూనే ఉన్నాడు.

 

ఈ నేపథ్యంలో టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు తమన్.  అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అల.. వైకుంఠపురములో' సినిమాకి కూడా తమన్ సంగీతం మంచి మ్యూజికల్ హిట్టుగా నిలిచింది.  ఈ రెండు మూవీస్ హిట్ టాక్ ను అందుకున్నప్పటికీ కలెక్షన్స్ విషయంలో ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తోంది. మా హీరో సినిమా ఎక్కువ వసూళ్లను సాధించిందంటే.. మా హీరో హీరో సినిమా ఎక్కువ వసూళ్లను సాధించిందని సామజిక మాధ్యమాల్లో రచ్చ నడుస్తోంది. ఈ సినిమా సక్సెస్ మీట్ ని ఇటీవల వైజాగ్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో తమన్ మాటలు వివాదానికి దారితీశాయి. నిజాలే మాట్లాడుకుందాం, నిజమైన కలెక్షన్లే చెప్పుకుందామనే మాటలు తమన్ నోటి వెంట వచ్చాయి.

 

దాంతో ఈ మాటలు సరిలేరు నీకెవ్వరు టీమ్ ను ఉద్దేశించినవా అంటూ సోషల్ మీడియాలో వార్ మొదలైంది. వివాదరహితుడిగా పేరొందిన థమన్ కాస్తా నోరు జారి అభిమానులతో విమర్శలపై స్పందించారు. తను కావాలని అన్న మాటలు కావని, ఎవరినీ టార్గెట్ చేసి అలా మాట్లాడలేదని.. క్యాజువల్ గా అన్నీ నిజాలే మాట్లాడుకుందామని ఫ్లోలో అనేశానని చెప్పారు. త్వరలోనే మళ్లీ  మహేష్ సినిమాకి పని చేయబోతున్నానని చెప్పారు. తాను ఎవరినో ఉద్దేశించి అన్నానని, ఎవరికోసమో అన్నానని అనుకోవద్దని.. అలా అనిపించి ఉంటే తను కావాలని చేయలేదని.. తనను అర్థం చేసుకోవాలని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: