సుప్రీం హీరో సాయి తేజ్ ,మినిమం గ్యారెంటీ   డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ప్రతి రోజు పండగే గత ఏడాది డిసెంబర్ చివర్లో  విడుదలై  ఊహించని విజయం సాధించింది. నిన్నటి తో  ఈ సినిమా థియేట్రికల్ రన్  ముగిసింది.  ఫుల్ రన్ లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 32.48కోట్ల షేర్ ను రాబట్టి మారుతి ,తేజ్ కెరీర్ లోనే  బిగెస్ట్  బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం  20కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం తో ఈ చిత్రం బయ్యర్లకు భారీ లాభాలను తీసుకొచ్చింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో  రాశిఖన్నా హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంస్థలు నిర్మించాయి.
 
ఇక  ఈ సినిమాతో  బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్న సాయి తేజ్ ప్రస్తుతం  నూతన దర్శకుడు సుబ్బు డైరెక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ అనే  చిత్రంలో నటిస్తున్నాడు. 
 
ప్రపంచ వ్యాప్తంగా  ప్రతిరోజు పండగే పూర్తి  వసూళ్లు : 
 
నైజాం - 11.4 కోట్లు 
సీడెడ్ - 3.8 కోట్లు 
ఉత్తరాంద్ర - 4.1 కోట్లు 
గుంటూరు - 1.9 కోట్లు 
తూర్పు గోదావరి - 2.1 కోట్లు 
పశ్చిమ గోదావరి - 1. 55 కోట్లు '
కృష్ణా - 2.01 కోట్లు 
నెల్లూరు - 0.9 కోట్లు 
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం షేర్ = 27.76 కోట్లు 
రెస్ట్ ఆఫ్  ఇండియా - 2.25 కోట్లు 
ఓవర్సీస్ - 2.47కోట్లు 
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా షేర్ = 32.48 కోట్లు 
 

మరింత సమాచారం తెలుసుకోండి: