సుప్రీం హీరో సాయి తేజ్ ,మినిమం గ్యారెంటీ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ప్రతి రోజు పండగే గత ఏడాది డిసెంబర్ చివర్లో విడుదలై ఊహించని విజయం సాధించింది. నిన్నటి తో ఈ సినిమా థియేట్రికల్ రన్ ముగిసింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 32.48కోట్ల షేర్ ను రాబట్టి మారుతి ,తేజ్ కెరీర్ లోనే బిగెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. కేవలం 20కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం తో ఈ చిత్రం బయ్యర్లకు భారీ లాభాలను తీసుకొచ్చింది. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. యువీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంస్థలు నిర్మించాయి.
ఇక ఈ సినిమాతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకున్న సాయి తేజ్ ప్రస్తుతం నూతన దర్శకుడు సుబ్బు డైరెక్షన్ లో సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
నైజాం - 11.4 కోట్లు
సీడెడ్ - 3.8 కోట్లు
ఉత్తరాంద్ర - 4.1 కోట్లు
గుంటూరు - 1.9 కోట్లు
కృష్ణా - 2.01 కోట్లు
నెల్లూరు - 0.9 కోట్లు
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం షేర్ = 27.76 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా - 2.25 కోట్లు
ఓవర్సీస్ - 2.47కోట్లు
మొత్తం ప్రపంచ వ్యాప్తంగా షేర్ = 32.48 కోట్లు