'సరిలేరు నీకెవ్వరు' సినిమాను సంక్రాంతి బరిలో విజేతగా నిలిపిన అనిల్ రావిపూడి, ఆ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. మ‌హేష్ బాబు హీరోగా ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రం సూప‌ర్ డూప‌ర్ హిట్ అయింది. ఈ యేడాది మొదట్లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘ఎఫ్ 2’ మూవీ బ్లాక్ బస్టర్ అయింది. మ‌ళ్లీ ఇప్పుడు మ‌రో సారి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇలా వరుస హిట్లతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి ఫుల్ జోష్‌లో ఉన్నాడు.

 

అయితే మనం ఎంత ఎత్తు ఎదిగినా సరే దాని తాలూకా మూలాలు మాత్రం ఎన్నడూ మర్చిపోకూడదు అన్న విషయాన్ని అనీల్ ఆలీ షో ద్వారా ఓసారి గుర్తు చేసుకున్నారు. వాస్త‌వానికి అనీల్‌ను నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప‌టాస్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ చిత్రం ఎలా స్టార్ట్ అయ్యిందో దానికి ముందు ఎంత క‌ష్ట‌ప‌డ్డారో అనీల్ రావిపూడి ఈ షో ద్వారా తెలిపారు. క‌ళ్యాణ్ రామ్ అప్ప‌టికే తన సొంత బ్యానర్ లో ఓం చిత్రం తీశారు. కాని.. ఆ చిత్రం బాక్సాఫిస్ వ‌ద్ద ప‌డ‌డంతో తనకి కొంచెం గ్యాప్ కావాలని తనని అడిగడమే కాకుండా మళ్ళీ తన బ్యానర్ లోనే అంటే కొంచెం ఆలోచించారని చెప్పుకొచ్చాడు అనిల్‌.

 

అలాంటి స‌మ‌యంలో  తాను ఇతర నిర్మాతలను ఈ కోసం ట్రై చేస్తుంటే ఎవరూ కూడా ముందుకు రాలేద‌ని.. ఆ టైంలో కళ్యాణ్ రామ్ గారు తనని తన ఆఫీస్ కి పిలిచి సాధ్యమైనంత వరకు మనం ట్రై చేద్దాం లేకపోతే ఈ చిత్రాన్ని తన బ్యానర్ లోనే చేద్దామని మాటిచ్చారని.. అది తన లైఫ్ లో ఎప్ప‌టికీ మర్చిపోలేనని తెలిపారు అనిలీ రావిపూడి. కాగా, ప్ర‌స్తుతం పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, స‌రిలేరు నీకెవ్వ‌రు వంటి వరుస బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఓటమి ఎరుగుని దర్శకుడిగా ఫామ్‌లో ఉన్నాడు అనిల్ రావిపూడి.

మరింత సమాచారం తెలుసుకోండి: