ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ మన తెలుగు వారికి కూడా బాగా సుపరిచితమే. కొన్నేళ్ల క్రితం విక్టరీ వెంకటేష్ సరసన ఆమె నటించిన మల్లీశ్వరి సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుని కత్రినాకు బాగా పేరు తెచ్చిపెట్టింది. అనంతరం ఆమె నందమూరి బాలకృష్ణ సరసన అల్లరి పిడుగులో కూడా హీరోయిన్ గా నటించింది. ఇక ఆ తరువాత నుండి బాలీవుడ్ కే పరిమితం అయిన కత్రినా, మెల్లగా పలువురు బాలీవుడ్ ప్రముఖ నటుల సరసన అవకాశాలు దక్కించుకుని అనతికాలంలోనే అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. 

 

మొదట బాలీవుడ్ అందగాడు హృతిక్ రోషన్ తో కలిసి కొన్నాళ్ళు చెట్టాపట్టాలేసుకుని తిరిగిన కత్రినా, అనుకోకుండా అతడి నుండి బ్రేకప్ అయి విడిపోయింది. ఆ తరువాత కండలవీరుడు సల్మాన్ తో కలిసి పలు పార్టీలు, ఫంక్షన్స్ లో దర్శనం ఇచ్చింది. ఆ తరువాత అతడి నుండి కూడా విడిపోయింది. ఇక ఇటీవల కొద్దిరోజలుగా ఉరి మూవీ ఫేమ్ విక్కీ కౌశల్ ప్రక్కన్న అక్కడక్కడా కనపడుతున్న కత్రినా, అతడితో డేటింగ్ లో ఉన్నట్లు కొద్దిరోజులుగా బాలీవుడ్ వర్గాల్లో వార్తలు షికారు చేస్తున్నాయి. ఇక ఎట్టకేలకు నిన్న రాత్రి ముంబైలోని విక్కీ స్నేహితుడి ఇంట్లో కత్రినా, విక్కీ ఇద్దరూ కూడా రహస్యంగా కలుసుకున్నారని, 

 

అయితే అదే సమయంలో వారు విడివిడిగా తమ కార్లలో ఎక్కుతున్న సమయంలో విషయాన్ని గ్రహించిన అక్కడి స్థానిక మీడియా సోదరులు, వారిద్దరి ఫోటోలు తీసి సోషల్ మీడియా మాధ్యమాల్లో పెట్టారు. నిజానికి కొన్నాళ్ల క్రితం వీరిద్దరూ కలిసి అర్ధరాత్రి వేళ ఒక ప్రముఖ రెస్టారెంట్ కి వెళ్లి రహస్యంగా డిన్నర్ చేసిన సమయంలో వారికి ఫుడ్ సర్వ్ చేసిన చెఫ్ ఒకతను వారిద్దరి ఫోటోలు తీసి తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసాడు. ఇక ఆ తరువాత మళ్ళి ఇన్నాళ్లకు ఈ ఇద్దరూ కూడా అర్ధ రాత్రి వేళ రహస్యంగా చిక్కడంతో, వారు డేటింగ్ లో ఉన్న విషయం తేటతెల్లం అయిందని, అయితే దానిని వారిద్దరే దానిని ప్రకటించవలసి ఉందని అంటున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: