ఈ సంక్రాంతికి వచ్చిన అల.. వైకుంఠపురములో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఈ మెగా విజయానందంలో ఉన్న అల్లు అర్జున్ కు ఓ చేదు వార్త వినాల్సి వచ్చింది. తన మేనమామ ముత్తంశెట్టి ప్రసాద్ హఠాన్మరణం బన్నీని తీవ్ర విషాదంలో నింపింది. బన్నీ- సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న టినెటివ్ టైటిల్ AA20 సినిమాకు ముత్తంశెట్టి ప్రసాద్ మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

 

 

ఇంతలో ఈ దుర్ఘటన బన్నీని తీవ్ర విషాదంలో నింపింది. ముత్తంశెట్టి ప్రసాద్ బన్నీకి పెద మేనమామ. ఈయన విజయవాడ నివాసి. తీవ్ర గుండెపోటుతో ఆయన హఠాన్మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న అల్లు కుటుంబసభ్యులు విజయవాడ బయలుదేరి వెళ్లారు. బన్నీ తల్లి నిర్మలా దేవికి ఆయన స్వయానా సోదరుడు.  ఆయన తొలి సినిమా బన్నీతోనే తీస్తూండటంతో బన్నీతో సహా కుటుంబసభ్యులందరూ ఎంతో సంతోషించారు. ఇంతలోనే ఈ దుర్ఘటన జరగడంతో వారంతా విషాదంలో ఉన్నారు. ఈ వార్తతో AA20 సినిమా యూనిట్ తో సహా మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు కూడా విషాదంలో మునిగిపోయారు. నిర్మాణ భాగస్వామిగా ఆయన సినీ ప్రస్థానంపై బన్నీతో సహా ముత్తంశెట్టి కుటుంబసభ్యులు  కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

 

 

అల.. బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఆనందంలో ఉన్న బన్నీకి ఇది మింగుడుపడని విషయం. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటివలే ప్రారంభమైంది. బన్నీ లేని సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరిస్తున్నారు. మరొకొద్ది రోజుల్లో బన్నీ కూడా ఈ షూటింగ్ లో పాల్గొనాల్సి ఉంది. ఈ వార్తతో ముత్తంశెట్టి కుటుంబసభ్యులు ఎవరైనా భాగస్వామిగా వస్తారా లేదా అనేది తర్వాత రోజుల్లో తేలాల్సి ఉంది. పూజా హేగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ సంగీతం అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: