పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సినిమా ఇండస్ట్రీలో ఎంత గొప్ప పేరు ఉన్నదో చెప్పక్కర్లేదు.  సినిమా పరంగా ఆయనకు ఎంతగానో కలిసి వచ్చిన అంశాలు చాలా ఉన్నాయి. తొలిప్రేమ, తమ్ముడు,  బద్రి, ఖుషి ఇలా చాలా సినిమాల ద్వారా అయన ట్రెండ్ ను సృష్టించారు.  పవన్ కళ్యాణ్ సినిమా సూపర్ హిట్ కొట్టింది అంటే, ఆ సినిమా రికార్డులు బద్దలు కొట్టుకుంటూ పోతుంది.  అయితే, కొన్నాళ్లుగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు పింక్ సినిమా రీమేక్ తో మరలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.  


ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు సినిమాలు చేసేందుకు కూడా రెడీ అవుతున్నారు.  సినిమా ఇండస్ట్రీలో ఆయనకు ఉన్న క్రేజ్ గురించి గుర్తు చేసుకోవలసిన అవసరం లేదనే విషయం అందరికి తెలిసిందే.  అయితే, సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఎంతగా కష్టపడతారో తెలుసు.  అజ్ఞాతవాసి హిట్ కాలేదు కాబట్టి అయన వెనకబడ్డాడు.  ఇప్పుడు పింక్ సినిమా తప్పనిసరిగా మెప్పిస్తుందని అంటున్నారు.  ఈఏడాది సమ్మర్ కు రిలీజ్ చేస్తారట.  


ఇకపోతే, ఈనెల 27 వ తేదీన పవన్ కళ్యాణ్ 27 మూవీ కూడా ప్రారంభం కాబోతున్నది.  ఏ ఎం రత్నం నిర్మాతగా, క్రిష్ దర్శకత్వంలో సినిమా ఉండబోతుందట.  ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో చిత్రికరించబోతున్నారు.  తెలుగుతో పాటుగా బాలీవుడ్, కోలీవుడ్ లో కూడా సినిమాను రిలీజ్ చేస్తారట.  ఈ సినిమా కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు జరుగుతున్నాయి.  బాలీవుడ్ కు చెందిన స్టార్ హీరోయిన్ ను తీసుకోబోతున్నారని సమాచారం.  


క్రిష్ ఈ కథను వినూత్నంగా తయారుచేశారని, పురాణాలకు సంబంధించిన కథతో సినిమా తెరకెక్కబోతున్నట్టు తెలుస్తోంది.  పాన్ ఇండియా మూవీ అంటే బడ్జెట్ కూడా భారీగానే ఉంటుంది.  ఏ ఏం రత్నం వంటి నిర్మాత దొరికాడు అంటే ఆ సినిమా భారీగానే ఉంటుంది.  ఖుషి సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు.  ఆ తరువాత ఏ ఏం రత్నం పులి సినిమా తీశాడు. కానీ, అది ఫెయిల్ అయ్యింది.  మరో సినిమా చేస్తానని పవన్ అప్పుడు మాట ఇచ్చాడట.  ఆ మాటను ఇలా పవన్ నిలబెట్టుకుంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: