ఇంతకుముందు నార్త్ నుంచి టాలీవుడ్ కి వచ్చిన ఇలియానా .. శిల్పాశెట్టి.. ప్రీతి జింతా.. కత్రిన లాంటి హాట్ బ్యూటీస్ చేయని సాహసం ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిన పూజా హెగ్డే చేయడం చూస్తే ఎవరైనా మెచ్చుకోకుండా ఉండలేరు. ముంబై ర్యాంప్ వాక్ బ్యూటీస్ తెలుగు భాషని నేర్చుకోలన్న తపన,  జ్ఞానం చూసి మనవాళ్ళు తెగ పొగిడేస్తున్నారు. ఇక 2020 లో బ్లాక్ బస్టర్ సాంగ్ గా నిలిచిన  సామజవరగమన...రికార్డ్ ని క్రియోట్ చేసింది. అల వైకుంఠపురములో సక్సెస్ కి మ్యూజిక్ ఆల్బమ్ ఎంత పెద్ద ప్లస్ అయ్యిందో.. ఈ ఒక్క పాటా అంతే ప్లెస్ అయ్యింది. సోషల్ మీడియాలో ఈ సాంగ్ కోట్ల వ్యూస్ తో వైరల్ అయిపోయింది. 

 

ఈ సాంగ్ ను అన్ని చోట్లా యూత్ తో పాటు సీనియర్ ఆడియన్స్ కూడా హమ్ చేస్తూరు. అయితే ఇప్పుడు సినిమాలో బన్ని సరసన నటించిన హీరోయిన్ పూజా హెగ్డే సక్సెస్ సెలబ్రేషన్స్ లో సింగర్ గా మారిపోయి సామజవరగమన అని పాట అందుకుంది. వైజాగ్ ఈవెంట్లో పూజా పాటకు చిత్రబృందం లేచి చప్పట్లతో మోతెక్కించేశారు. వచ్చీ రాని భాషతో పలకలేని పదాలతో ఒక రకంగా పూజా నానా తంటాలు పడినప్పటికి.. బాగా టరి చేసిందని  అందరు చప్పట్లు కొట్టి సూపర్బ్ అన్నారు. ఇక పూజా 'అలా' పాడుతుంటే.. తన వెంటే ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ థమన్ తన పాటకి తగ్గట్టుగా బీట్ అందించాడు.

 

అయితే అరవింద సమేత సినిమా నుంచి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ ఆకట్టుకుంటున్న పూజా ఇలా లైవ్ వేడుకలో పాట పాడే సాహసం చేసేయడం ఆశ్చర్యకరం. ఇంకా భాషపై పట్టు లేకపోవడంతో కొన్ని పదాల్ని అర్థవంతంగా పలకలేకపోయింది. హిందీ భాష అంత ఈజీగా తెలుగు నేర్చుకోవడం కుదరదు కదా. ప్రపంచంలోనే నేర్చుకోవడం అత్యంత కష్టం అని చెప్పే భాష ఇదిమన తెలుగు. అలాగే ఎక్కువ పదాలు ఉండే భాష కూడా తెలుగు. అందుకే పూజా ఎంత ప్రయత్నించినా ఇంకా తెలుగుపై పట్టు సంపాదించలేకపోయింది. ఇక్కడే కొంతమంది తెలుగు భాష మీద మమకారం ఉన్న వాళ్ళి దొరికిపోయింది. ఆ పాట విన్న కొందరు నెటిజన్స్ పూజాని బాగా ట్రోల్ చేస్తున్నారు. రక రకాల కామెంట్స్ తో పూజాని ఆడేసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: