జనసేనానిని  మళ్ళీ సిల్వర్ స్క్రీన్ పై చూడాలన్న అభిమానుల కోరిక త్వరలోనే నెరవేరనుంది . రాజకీయాల్లో అడుగిడిన పవన్ , ఇక సినిమా రంగానికి గుడ్ బై చెప్పినట్లేనని అందరూ భావించారు . పవన్ కూడా తానింకా  సినిమాల్లో నటించబోనని పలుమార్లు తేల్చి చెప్పాడు . కానీ అభిమానుల కోరిక మేరకు పవర్ స్టార్ మనస్సు మార్చుకున్నారు . రాజకీయాల్లో బిజీగా ఉన్న , పవన్ కళ్యాణ్ మళ్ళీ  సినిమాల్లో  రీఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే .

 

హిందీ లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించిన పింక్ రీమేక్ సినిమా ద్వారా పవన్ మళ్ళీ  సినిమాల్లో నటిస్తున్నాడు . పింక్ చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు , బోనికపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు . ఈ చిత్రం లో అంజలి ,  నివేదా థామస్ , అనన్య లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు .  ఈ సినిమా కోసం పవన్ కేవలం 30 రోజులు మాత్రమే కాల్షీట్స్ ఇచ్చిన నేపధ్యం లో , పవర్ స్టార్  కోసం నిర్మాణ సంస్థ  ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు తెల్సుతోంది . ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే , పవన్ ఈ సినిమాలో నటిస్తున్నాడు . హైదరాబాద్  పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ లో  పవన్ పాల్గొనేందుకు వీలుగా ,  పవర్ స్టార్ సమయభావాన్ని తగ్గించాలన్న లక్ష్యం తో   నిర్మాత దిల్ రాజు ఒక విమానయాన సంస్థ తో ఈ మేరకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సమాచారం .

 

ప్రత్యేక విమానం కోసం దిల్ రాజు, దాదాపు కోటి రూపాయల మేర ఖర్చు చేయనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు అంటున్నాయి . పవర్ స్టార్ ఈ చిత్ర షూటింగ్ లో పాల్గొన్న చిత్రాలు సోషల్ మీడియా లో వైరల్ గా మారిన  విషయం తెల్సిందే . చిత్ర షూటింగ్ విషయాలు బయటకు పొక్కడం పట్ల పవర్ స్టార్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం . ఇక పై షూటింగ్ విషయాలు బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: