తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే తెలియని వాళ్ళు ఉండరేమో.. ఈ మధ్య కాలంలో మహేష్ బాబు ఫ్యాన్స్ మరింత పెరిగారు అని వేరేలా చెప్పనకకర్లేదు.. శ్రీమంతుడు చిత్రం నుండి వరుస హిట్ లతో మహేష్ దూసుకుపోతు న్నాడు.. అయితే ఇప్పుడు సరిలెరు నికెవ్వరు సినిమాలో నటించాడు..అనిల్ రావపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది..రిలీజ్ అయిన మొదటి రోజునుండి ఈ సినిమా మంచి టాక్ తో కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది..

 

ఇకపోతే.. సూపర్‌స్టార్ మహేష్ బాబు 27వ సినిమా మరో రెండు నెలల్లో ప్రారంభం కాబోతోంది. ఈలోగా మహేష్ ఫ్యామిలీతో విహారయాత్రలను ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్న టాపిక్‌పై చాలా కాలంగా చర్చ జరుగుతోంది. ఇదే విషయాన్ని మహేష్ బాబును అడిగితే.. ‘నాకు తెలీదు. ఫ్యాన్సే హీరోయిన్‌ని వెతికి పెట్టాలి’ అని సెటైర్ వేశారు. అయితే SSMB27 సినిమాలో హీరోయిన్ గురించి మహేష్ భార్య నమ్రత  నిర్ణయానికి వచ్చిందని సమాచారం..

 

సినిమాలో కియారా అడ్వాణీ అయితే బాగుంటుందని నమ్రత అభిప్రాయపడ్డారట...మహేష్, కియారా కాంబినేషన్‌లో వచ్చిన ‘భరత్ అనే నేను’ సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. తన తర్వాతి సినిమాను మహేష్ వంశీ పైడిపల్లితో తీస్తున్నారు. గతంలో వీరిద్దరూ కలిసి ‘మహర్షి’ సినిమా కోసం పనిచేశారు. అది కూడా మంచి సక్సెస్ అందుకుంది. అందుకే మరోసారి వంశీతో కలిసి పనిచేయాలని మహేష్ అనుకున్నారు. అంతేకాదు వంశీ సినిమా తర్వాత తన డేట్లను అనిల్ రావిపూడికి ఇస్తున్నట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహేష్ అన్నారు.

 

అనిల్ తో మరో సినిమా తీయాలని అనిల్ భావిస్తున్నారట..అయితే మహర్షి హిట్ అవ్వడంతో మళ్లీ వంశీ పైడి పల్లి దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నారు..సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా తమన్‌ను ఎంచుకున్నారు. .. ఈ సినిమా తర్వాత మహేష్ శ్రీనువైట్ల దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: