సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ వేరు.  అయన సినిమా అంటే అభిమానులు చెవులు కోరుకుంటారు.  సినిమా కోసం కళ్ళు కాయలుకాసేలా ఎదురు చూస్తుంటారు.  అలాంటి పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తరువాత సినిమా ఇండస్ట్రీ నుంచి దూరంగా వెళ్లి రాజకీయాల్లో స్థిరపడ్డారు.  రాజకీయాల్లోనే ఉండిపోతానని, ఇక సినిమాలు చేయబోనని అన్నారు.  అయితే, అంతకు ముందు పవన్ కళ్యాణ్ కు కొంతమంది నిర్మాతలు సినిమా చేసేందుకు అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు.  


వారి అడ్వాన్స్ తిరిగి ఇవ్వాలని పవన్ అనుకుంటే, దానికి వాళ్ళు ఒప్పుకోలేదు.  తన స్థానంలో చరణ్ ను హీరోగా సినిమాలు చేస్తారని చెప్పినా ఒప్పుకోలేదట. పవన్ కళ్యాణ్ మాత్రమే సినిమా చేయాలని, అప్పటి వరకు వెయిట్ చేస్తామని చెప్పారు.  నిర్మాతల నుంచి ఒత్తిడి పెరిగిపోతుండటంతో చివరకు కళ్యాణ్ సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు.  దానికి అనుగుణంగానే ఇప్పుడు పింక్ సినిమా చేస్తున్నారు.  


బాలీవుడ్ లో సూపర్ హిట్టైన పింక్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు.  ఈ సినిమాను దిల్ రాజుతో పాటుగా బోనీకపూర్ నిర్మిస్తున్నారు.  ఇటీవలే షూటింగ్ ప్రారంభం అయ్యింది.  అయితే, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నారు.  రాజకీయాల్లో బిజీగా ఉంటూనే సినిమా చేసేందుకు అంగీకరించారు.  షూటింగ్ ఉన్నప్పుడు హైదరాబాద్ కు, షూటింగ్ అయ్యాక తిరిగి అమరావతి వెళ్తున్నారు. సమయం తగ్గించేందుకు దిల్ రాజు విమానయాన సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు.  


హైదరాబాద్ నుంచి గన్నవరం వరకు స్పెషల్ ఫ్లైట్ బుక్ చేసుకున్నారు.  పవన్ ఈ సినిమా కోసం 30 రోజులు సమయం ఇచ్చారు కాబట్టి, ఈ 30 రోజులు ఆ ఫ్లైట్ అందుబాటులో ఉంటుంది.  షూటింగ్ ఉన్న సమయంలో పవన్ ను అమరావతి నుంచి హైదరాబాద్ తీసుకొస్తుంది.  అక్కడి నుంచి తిరిగి అమరావతి తీసుకెళ్తుంది.  ఈ ఫ్లైట్ కోసమే దిల్ రాజు కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నట్టు తెలుస్తోంది.  పవన్ కు ఇప్పుడున్న క్రేజ్ దృష్ట్యా ఎంత ఖర్చు చేసినా తప్పులేదని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: