ప్రస్తుతం టాలీవుడ్ లో ఇద్దరి హీరోయిన్స్ హవా ఓ రేంజ్ లో కొనసాగుతుంది. అందులో ఒకరు పూజా హెగ్దె కాగా.. మరొకరు రష్మిక మందన్న. బాలీవుడ్ భామ పూజా హెగ్దె తన గ్లామర్ లుక్స్ తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తుంటే.. కన్నడ పరిశ్రమ నుండి వచ్చిన రష్మిక తన అభినయంతో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది. ఇద్దరిది చెరోదారి అయినా సరే ఇద్దరికి టాలీవుడ్ లో వరుస స్టార్ అవకాశాలు వస్తున్నాయి. ముందుగా పూజా హెగ్దె గురించి చెబితే ముకుందా, ఒక లైలా కోసం సినిమాల్లో జస్ట్ ఓకే అనిపించిన ఈ అమ్మడు బన్ని పక్కన డిజేలో దుమ్ముదులిపేసింది. ఆ సినిమా తర్వాత నుండి అమ్మడు తిరిగి చూసుకోలేదని చెప్పొచ్చు.

 

రీసెంట్ గా మళ్లీ బన్ని హీరోగా చేసిన అల వైకుంఠపురమురములో సినిమాతో సూపర్ హిట్ అందుకుంది పూజా హెగ్దె. సినిమాలో అమ్మడి స్కిన్ షో కి ప్రేక్షకులు తమ హృదయాలను రాసిచ్చేశారంటే నమ్మాల్సిందే. అల తర్వాత ప్రభాస్ తో సినిమా చేస్తున్న పూజా మరో రెండు పెద్ద ప్రాజెక్టులు పట్టిందని తెలుస్తుంది. ఇక పూజా హెగ్దెతో సమానంగా ఫాం కొనసాగిస్తుంది రష్మిక మందన్న. ఛలో, గీతా గోవిందం సినిమాతో హిట్ అందుకుంది సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ కొట్టిన రష్మిక సుకుమార్, బన్ని సినిమాలో నటిస్తుందట.

 

ఇదే కాకుండా త్రివిక్రం, ఎన్.టి.ఆర్ కాంబోలో వచ్చే సినిమాలో కూడా హీరోయిన్ గా రష్మిక నటిస్తుందని తెలుస్తుంది. కన్నడ నుండి వచ్చిన రష్మిక తన అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేస్తుంది. మీకర్ధమవుతుందా అంటూ తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రాళ్లను తెగ ఇబ్బంది పెడుతుంది. చూస్తుంటే పూజా, రష్మిక మిగతా హీరోయిన్స్ కు ఛాన్స్ ఇవ్వకుండా వీళ్లే వరుస స్టార్ సినిమాలు చేసేలా ఉన్నారు. వీళ్ళిద్దరి డేట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: