తెలుగులో అగ్ర హీరోయిన్ గా తన ముద్ర వేసిన హీరోయిన్లలో సమంత ఒకరు. ఈ దశాబ్దంలో ఆమె తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. అటు గ్లామర్ పరంగానూ, ఇటు నటన పరంగానూ తనకి సాటి ఎవరూ లేరనేంతగా ప్రభావం చూపించింది. నాగ చైతన్యని పెళ్ళి చేసుకున్న తర్వాత ఆమె ఎంచుకునే సినిమాల్లో చాలా మార్పు వచ్చింది. అప్పటి నుండి ఆమె నటనా ప్రాధాన్యమున్న చిత్రాల్లోనే నటిస్తుంది.
ప్రస్తుతం సమంత జాను అనే సినిమాలో నటిస్తుంది. శర్వానంద్ హీరోగా ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజైన టీజర్ కి మంచి స్పందన లభించింది. అయితే ఈ సినిమా తర్వాత సమంత మరే సినిమా ఒప్పుకోకపోవడం ఆశ్చర్యంగా ఉంది. టీవలే అమేజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్-2లో నటించింది. అది పూర్తి చేశాక కూడా కొత్త సినిమా ప్రకటన ఏదీ రాలేదు.
మునుపటిలా స్టార్ హీరోల సరసన గ్లామర్ రోల్స్ చేయడానికి ఆమె ఒప్పుకుంటున్నట్లు లేదు. ఫిలిం మేకర్స్ కూడా ఆమెకు అలాంటి పాత్రలు ఆఫర్ చేస్తున్నట్లు లేదు. తాజాగా సమంత ఓ టీవీ షో చేయడానికి రెడీ అవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మంచు లక్ష్మి, రానా దగ్గుబాటి తరహాలోనే ఆమె టాక్ షో ఒకటి చేయడానికి ఒప్పుకుందని.... అందుకోసం సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు.
అయితే సినిమాలు మానేసి టీవీ షోల ద్వారా మన ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తుందని అంటున్నారు. గతంలో సినిమాలు మానేయడం గురించి క్లారిటీగా వివరించిన సమంత మరికొద్ది రోజుల్లో తాను అనుకున్నది చేసేలాగా కనిపిస్తుంది. అదీ గాక తాను తల్లి అవడానికి కూడా సిద్ధంగా ఉండడంతో మరే సినిమాలు ఒప్పుకోవట్లేదని అంటున్నారు.