యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరు పరిచయం అక్కర్లేని పేరు. రాఘవేంద్ర సినిమాతో మొదలయ్యి ఎన్నో సినిమాలలో నటిస్తూ వచ్చాడు. అతని సినిమాలతో పాటుగా అతని ప్రవర్తనకు కూడా మంచి ఫ్రెండ్స్ మరియు మంచి అభిమానులు కూడా ఉన్నారు. బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న డార్లింగ్ ఈ మధ్య కాస్త డీలా పడ్డాడు..

 

విలన్ పాత్రల్లో నటించడం అంత ఈజీ కాదని అంటున్నారు బాలీవుడ్ నటుడు చుంకీ పాండే. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమాలో చుంకీ విలన్ పాత్రలో నటించారు. 2017లో వచ్చిన ‘బేగమ్ జాన్’ సినిమాలో అయితే మరీనూ. కరుడుగట్టిన కామాంధుడిలా కనిపించారు. అయితే ఈ పాత్రల్లో నటించడం వల్ల తనపై తీవ్ర ప్రభావం చూపాయని అంటున్నారు చుంకీ. ‘సాహోలో నాది విలన్ పాత్ర. నా ఆలోచనలన్నీ క్లిష్టంగా ఉంటాయి.

 

బేగమ్ జాన్’ సినిమాలో దేవ్‌రాజ్‌ అనే విలన్ పాత్రలో నటించాను. ఈ సినిమాలో నా పాత్ర ఎలా ఉంటుందంటే నేను ఓ వంద సార్లు చనిపోయి బతికినట్లుగా చూస్తారు. ఎప్పుడూ హ్యాపీగా జోవియల్ పాత్రల్లో నటిస్తూ వస్తున్న నాకు ఒక్కసారిగా విలన్ పాత్రలు చేయడం మొదలుపెట్టాను. ఇది నాకు ఛాలెంజ్ అనే చెప్పాలి...అలా సినిమాలో విలన్ పాత్రలో కనిపించాడు..

 

సాహో’ సినిమాను సుజీత్ తెరకెక్కించారు. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించారు. జాకీ ష్రాఫ్, చుంకీ పాండే, మందిరా బేడీ, నీల్ నితిన్ ముఖేష్ కీలక పాత్రలు పోషించారు. గతేడాది ఆగస్ట్ 15న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను అందుకుంది. ఫ్యాన్స్ ఆశించినంత స్థాయిలో సినిమా ఆడలేకపోయింది... ప్రస్తుతం ప్రభాస్ జాన్ సినిమాలో ఈసినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది...

మరింత సమాచారం తెలుసుకోండి: