టాలీవుడ్ లో బుక్స్ బాగా చదివే వాళ్ళలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరు ముందు ఉంటుంది. మన దర్శకుల్లో క్రిష్ .. త్రివిక్రమ్ లాంటి వాళ్లు పుస్తకాల పురుగులు అని అందరికీ తెలిసిందే. వీళ్ళ ఇళ్ళల్లో ఒక పెద్ద గదినిండా పుస్తకాలే ఉంటాయట. ఇక సైలెంట్ గా ఉండే వాళ్ళు బాగా తక్కువగా మాట్లాడేవాళ్ళు బుక్స్ బాగా చదువుతారని మిగతావాళ్ళ క్మటే విళ్ళాకి అన్ని విషయాలలో విషయ పరిజ్ఞానం బాగా ఉంటుందని అంటుంటారు. 

 

ఇక పుస్తకాలు చదవడంలో హీరోయిన్స్ గురుంచి చెప్పాలంటే ముందు మన మిల్కీ బ్యూటీ తమన్నా గురించే చెప్పాలి. ఈవిడకి పుస్తకాలు చదవడం అంటే మహా ఇష్టమట. తనకి బాగా నచ్చేవాటిల్లో డాన్స్ ఆ తర్వాత పుస్తకాలు చదవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తుందట తమన్న. అయితే ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ వల్ల పుస్తకానికి దూరమైపోయానని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాదు తన లైఫ్ ని మార్చేసిన ఓ రెండు పుస్తకాల గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది.

 

ప్రస్తుతం తమన్న ఆధ్యాత్మికంలో ఉందట. అందుకు కారణం 'ఓషో'. ఆ పేరు చదివితే చాలు.. ఆ పేరు నా జీవితానికి మేలి మలుపు లాంటిది... అంటోంది. ఆధ్యాత్మికతను బాగా అర్థం చేసుకోవడానికి ఆ పుస్తకం తమన్నాకు చాలా సహాయపడిందట. ఇక తమన్న జీవనశైలి పై విపరీతమైన ప్రభావాన్ని చూపిన మరో పుస్తకం రోరే ఫ్రీడ్మాన్ అండ్ కిమ్ బర్నౌయిన్ రాసిన 'స్కిన్నీ బిచ్' అట. ఆ పుస్తకం చదివిన తర్వాతే తమన్న మాంసాహారం మానేసిందట. శాఖాహారం అలవాటు పడటానికి తమన్నాను ఆగా ప్రేరేపించిన పుస్తకం 'స్కిన్నీ బిచ్' అని అందరూ షాకయ్యో విషయలాను బయట పెట్టింది.

 

2019 లో ఎఫ్ 2 - సైరా నరసింహారెడ్డి సినిమాల్లో నటించిన తమన్నాకి నటిగా మంచి పేరొచ్చింది. సంక్రాంతి బరిలో నిలిచిన సరిలేరు నీకెవ్వరులో స్పెషల్ పార్టీ సాంగ్ తో కూడా బాగా ఆకట్టుకుంది. అలాగే ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన 'దటీజ్ మహాలక్ష్మి' రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది. ఇక మాస్ హీరో గోపిచంద్ 28వ సినిమాలోనూ తమన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు బాలీవుడ్ లో బోలే చుడియాన్ అనే సినిమాలోనూ నటిస్తోంది.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: