అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ కావడంతో బన్నీ ఆకాశమంత ఆనందంలో మునిగి తేలుతున్నాడు. దాదాపు సంవత్సరంన్నర గ్యాప్ తర్వాత వచ్చిన ఈ సినిమా బన్నీ కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. యుఎస్ లో అయితే ఈ సినిమా వసూళ్ళ మోత మోగించింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ మంచి వసూళ్ళు సాధిస్తూ రికార్డుల దిశగా పరుగులు పెడుతోంది.

 

 

అయితే ఈ సినిమా తర్వాత బన్నీ సుకుమార్ తో సినిమా చేస్తున్నాడన్న విషయం తెలిసిందే. సుకుమార్ సినిమా చిత్రీకరణ కూడా స్టార్ట్ అయింది. మరి కొద్ది రోజుల్లో బన్నీ కూడా ఈ షూటింగ్ లో రెగ్యులర్ గా పాల్గొంటాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతున్న ఈ కథలో ఎక్కువ మంది కొత్తవాళ్లే కనిపిస్తారట. చిత్తూరు యాస మాట్లాడే వాళ్ళే ఎక్కువగా ఉంటారని సమాచారం. బన్నీ కూడా చిత్తూరు యాసని నేర్చుకుంటున్నాడట.

 

 

అయితే ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నారట. రివెంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ని చకచకా కంప్లీట్ చేసుకుని సెప్టెంబర్ నెలలో విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారట. దసరా కానుకగా విడుదల చేయాలని డిసైడ్ అయినా, ఆ సమయంలో ఆర్.ఆర్.ఆర్ ఉండడం వల్ల ఆ నెల కాదని ఒక నెల ముందుగానే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. అయితే ఇప్పటి వరకు ఈ విషయమై ఎలాంటి స్పష్టత రాలేదు.

 

 

మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. మరి సుకుమార్ బన్నీసినిమా ఆ అంచనాలని అందుకుంటుందా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: