యువ సామ్రాట్ నాగ  చైతన్య ,మలయాళ బ్యూటీ సాయి పల్లవి ,ట్యాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల  కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం లవ్ స్టోరీ. యూత్ ఫుల్ లవ్  ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
 
ఇక ఈ  క్రేజీ  కాంబినేషన్ లో  వస్తున్న ఈ సినిమాపై  ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దాంతో  సినిమాను కొనడానికి  డిస్ట్రిబ్యూటర్లు ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక్కడే  కాదు  ఓవర్సీస్ లో కూడా  ఈ సినిమాకు క్రేజ్ బాగానే  వుంది. దాంతో ఈ సినిమా ఓవర్సీస్ హక్కులను ఓ  ప్రముఖ  డిస్ట్రిబ్యూషన్ సంస్థ 5.5కోట్లకు  దక్కించుకుందని సమాచారం. గతంలో  శేఖర్ కమ్ముల , సాయి పల్లవి ల కాంబినేషన్ లో వచ్చిన  ఫిదా  అక్కడ కూడా సత్తా చాటడంతో  ఇప్పుడు లవ్ స్టోరీ కి  ఫుల్ డిమాండ్ ఏర్పడింది. 
 
ఇక ఈ చిత్రంలో రాజీవ్ కనకాల , దేవయాని, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో  నటిస్తున్నారు.  ఏషియన్ సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ల పై  నారాయణ దాస్ నారంగ్ ,  రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి  ఏఆర్ రెహమాన్ శిష్యుడు  పవన్  సంగీతం అందిస్తున్నాడు.  అతనికిదే మొదటి సినిమా.  వచ్చే నెల  ఫిబ్రవరి 14న  ప్రేమికుల రోజు కానుకగా  ఈసినిమా టీజర్ ను విడుదలచేయనున్నారని  తెలుస్తుంది.  ఇక ఏప్రిల్ 2న  ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఇదిలా ఉంటేసాయి పల్లవి ఈచిత్రం తోపాటు  ప్రస్తుతం  తెలుగులో  నీదినాది ఒకే కథ ఫేమ్ వేణు ఉడుగుల డైరెక్షన్ లో విరాటపర్వం అనే చిత్రంలో నటిస్తుండగా  నాగ చైతన్య మాత్రం లవ్ స్టోరీ తరువాత ఇప్పటివరకు మరో సినిమాను  లైన్లో పెట్టలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: