బాహుబలి తర్వాత ఎన్నో పాన్ ఇండియా సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని బాహుబలి స్ఫూర్తితో రాగా, మరికొన్ని బాహుబలిని దాటేద్దామనే ఆలోచనతో వచ్చాయి. అయితే ఇప్పటి వరకు బాహుబలిని దాటిన సినిమా మాత్రం రాలేదు. బాలీవుడ్ లో బాహుబలిని మించి తీద్దామనే ఆలోచనలో చాలా సినిమాలే వచ్చినప్పటికీ, ఏదీ కూడా బాహుబలి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి.

 

 

 బాహుబలి స్ఫూర్తితో వచ్చిన సినిమాలన్నింటిలో అందరి దృష్టిని ఆకర్షించిన చిత్రం కేజీఎఫ్.. ఒక సాధారణ సినిమాగా రిలీజైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కన్నడ స్టార్ యశ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. కోలార్ గనులలో బంగారం స్మగ్లింగ్ మాఫియా నేపథ్యంలో సాగిన  ఈ సినిమాకి రెండవ ఛాప్టర్ సిద్ధం అవుతోంది. ప్రస్తుతం కేజీఎఫ్ ఛాప్టర్ 2 చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటుంది. 

 

 


ప్రస్తుతం మైసూరులో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఆఖరి షెడ్యూల్ హైదరాబాదులో జరుపుకోనుందట.  హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ భారీ షెడ్యూల్ తర్వాత చిత్రీకరణ పూర్తవుతుందట. ఈ రెండవ భాగం గురించి గతంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ సెకండ్ పార్టీ ఇంకా హెవీ యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంటుందని, వరల్డ్ మాఫియాను భారీ స్థాయిలో చూపించడం జరుగుతుందని అన్నారు. 

 

 

హై వోల్టేజి యాక్షన్ సీన్లతో, ఎమోషనల్ సీన్లతో సినిమా బాగా వస్తుందని అంటున్నారు. మరి కేజీఎఫ్ 2 మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న అభిమానుల నమ్మకాని వమ్ము కాకుండా చూస్తారేమో చూడాలి. ఇందులో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో సంజయ్ దత్ నటిస్తుండగా ఇంకొందరు ఇతర భాషల నటీ నటులు పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్ లో విడుదలకి సిద్ధం అవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: