సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా సినిమా సరిలేరు నీకెవ్వరు ఇప్పటికే చాలా ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ని దాటేసి మంచి లాభాల బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఓవర్సీస్ లో మాత్రం ఈ సినిమా ఆశించిన రేంజ్ లో కలెక్షన్స్ మాత్రం సంపాదించలేకపోతోందని అంటున్నారు. మహేష్ బాబు ఒక ఆర్మీ మేజర్ గా నటించిన ఈ సినిమా ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి చాలా రోజుల తరువాత నటిగా తెలుగు సినిమా పరిశ్రమకు అడుగుపెట్టడం జరిగింది. ఇక సంక్రాంతి సీజన్ తో పాటు, సూపర్ స్టార్ మహేష్ చాలా గ్యాప్ తరువాత మంచి కమర్షియల్ అంశాలున్న ఎంటర్టైనింగ్ రోల్ లో నటించడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు మాములు ఆడియన్స్ సైతం సినిమాను చూడడానికి ఎగబడ్డారు. 

 

ఇకపోతే ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురములో సినిమా కూడా మంచి సక్సెస్ సాధించి బాగా కలెక్షన్స్ ని రాబడుతోంది. అయితే గత కొద్దిరోజులుగా ఈ రెండు సినిమాల నిర్మాతల మధ్య కొద్దిపాటి కలెక్షన్స్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. మా సినిమా గొప్పది అంటే మా సినిమా గొప్పది అంటూ రెండు సినిమాల నిర్మాతలు ఒకరిని మించేలా మరొకరు కలెక్షన్స్ ఫిగర్స్ ని, పోస్టర్స్ ని ప్రకటిస్తూ ఎవరికి వారు చీప్ అవుతూ ప్రేక్షకుల దృష్టిలో నవ్వులపాలవుతున్నారని, ఈ విషయమై కొందరు సినీ విశ్లేషకులు బహిరంగంగా మాట్లాడడం జరుగుతోంది. ఇక ఇటీవల ఫ్యామిలీ తో కలిసి అమెరికాకు వెళ్లిన మహేష్

 

తమ సినిమాకు ఎప్పటికప్పుడు వస్తున్న కలెక్షన్ రిపోర్ట్స్ ని నిర్మాత దిల్ రాజుకి ప్ర‌తి రోజు ఫోన్ చేసి కనుక్కుంటున్నట్లు సమాచారం. మరోవైపు అల సినిమా యూనిట్ కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి తమ సినిమా నాన్ బాహుబలి2 రికార్డు ని సొంతం చేసుకున్నట్లు ప్రకటించడంతో, తాను యుఎస్ఏ నుండి తిరిగి రాగానే సరిలేరు కు సంబంధించి ఒక భారీ సక్సెస్ మీట్ పెట్టాలని కూడా మహేష్ యోచిస్తున్నట్లు టాక్. నిజానికి ఇటీవల సరిలేరు సక్సెస్ మీట్ వరంగల్ జిల్లా హన్మకొండలో జరుగగా, దానిని మించేలా ఈ సరికొత్త సక్సెస్ మీట్ ని సినిమా యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ రెండు సినిమాల విషయమై పంతాల కోసం ఇంకేమి జరుగుతాయో చూడాలి..!! 

మరింత సమాచారం తెలుసుకోండి: