ఎండాకాలం సెల‌వులు వ‌చ్చాయంటే చాలు ముందు అంద‌రూ కొత్త సినిమాలు చూడ‌టానికి రెఢీ అయిపోతారు. ఈ సారి సంక్రాంతికి విడుద‌లైన నాలుగు సినిమాల్లో మూడు సినిమాలు క‌లెక్ష‌న్లు కుమ్మేశాయి.  అదే రేంజ్ ఇప్పుడు స‌మ్మ‌ర్‌ని కూడా కుమ్మేద్దాం అని కొన్ని తెలుగు సినిమాలు విడుద‌ల‌కు సిద్ధంగా ఉన్నాయి. ఈ సంవ‌త్స‌రం చాలా సినిమాలే విడుద‌ల‌కు సిద్ధ‌మ‌య్యాయి. అందులో పవన్ కల్యాణ్, వెంకటేష్ లాంటి  స్టార్ హీరోలతో పాటు నాని, నాగ చైతన్య, సాయి ధరమ్ తేజ్ లాంటి కుర్ర హీరోలు కూడా ఈ సారి పోటీలో ఉన్నారు. ఇక ఈ సంద‌డి మార్చి నుంచే మొద‌లు కానుంది.

 

కీర్తి సురేష్ న‌టించిన మహానటి చిత్రం ఎంత పెద్ద హిట్ట‌యిందో అంద‌రికీ తెల‌సిందే.  తర్వాత కీర్తి సురేష్ మళ్లీ తెలుగులో పెద్ద‌గా కనిపించలేదు. మన్మథుడు 2చిత్రంలో చిన్న పాత్రలో క‌నిపించింది. ఇక ఇప్పుడు మిస్ ఇండియా అంటూ పూర్తిస్థాయి లేడీ ఓరియెంటెడ్ చిత్రంతో రాబోతుంది కీర్తి. ఈ చిత్రం మార్చ్ 6న విడుదలకు సిద్ధం కానుంది. ఈస్ట్‌కోస్ట్ బ్యాన‌ర్ పై మ‌హేష్‌కోనేరు నిర్మాత‌గా.. నరేంద్ర నాథ్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇంద్ర‌గంటి మోహ‌న్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో నాని విల‌న్‌గా రాబోతున్న చిత్రం వి. ఇది నాని 25వ చిత్రంగా వ‌స్తోంది. సుధీర్‌బాబు ఈ చిత్రంలో హీరోగా న‌టిస్తున్నాడు. మార్చ్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న ఈ చిత్రానికి దిల్‌రాజు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

 

నూత‌న ద‌ర్శ‌క‌డు కిశోర్ శ‌ర్వానంద్ హీరోగా `శ్రీ‌కారం ` అనే చిత్రం రాబోతుంది. ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుద‌ల‌వుతుంది. శ‌ర్వా ఇందులో రైతు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఉప్పెనగా రాబోతున్న‌ వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్నచిత్రం.  ఈ సినిమాను కొత్త దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఎప్రిల్ 2న విడుదల కానుంది ఈ చిత్రం.

 

ఇస్మార్ట్ శంకర్ లాంటి సంచలన విజయం తర్వాత రామ్ నటిస్తున్న చిత్రం రెడ్.  కిషోర్ తిరుమల తొలిసారి మాస్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఎప్రిల్ 9న విడుద‌ల‌కానుంది. విజయ్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న సినిమా మాస్టర్. ఈ చిత్రం ఎప్రిల్ 10న విడుదల కానుంది. ఫిదా లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత మూడేళ్లు గ్యాప్ తీసుకుని తెరకెక్కిస్తున్న సినిమా లవ్ స్టోరీ. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఈ సినిమాను ఎప్రిల్ 17న విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. సోలో బ్రతుకే సో బెటరూ అంటున్న  సాయి ధరమ్ తేజ్. గా కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కిస్తున్నాడు.  ఎప్రిల్ 24న ఈ సినిమా విడుదల చేయాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. అసురన్ సినిమాకు రీమేక్‌గా వెంకటేష్ నటిస్తున్న సినిమా నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను మే 1న విడుదల కానుంది. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమా క్రాక్. ఈ చిత్రం మే 8న ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.

 

 పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్న సినిమా పింక్ . బాలీవుడ్ రీమేక్ మూవీతో తిరిగి రీఎంట్రీ ఇస్తున్న విష‌యం తెలిసిందే.  ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు కానుంది.  మే 15న పింక్ రీమేక్ విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు నిర్మాత దిల్ రాజు. నాగార్జున అక్కినేని హీరోగా కొత్త దర్శకుడు సోల్మోన్ తెరకెక్కిస్తున్న సినిమా వైల్డ్ డాగ్. ఈ చిత్రంలో NIA అధికారిగా ఇందులో నటిస్తున్నాడు నాగ్. ఈ సినిమాను మే 22న విడుదల చేయబోతున్నారు. రానా, సాయి పల్లవి కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ  సినిమా విరాటపర్వం. వేణు ఉడుగుల తెరకెక్కిస్తున్న ఈ సినిమా  మే లోనే విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు. 

 

 నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న చిత్రం రంగ్ దే.  మేలో ఈ చిత్రం విడుదల చేయాలని చూస్తున్నారు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు. హ్యాట్రిక్ ఫ్లాపులతో డీలా పడిన అఖిల్.. తన నాలుగో సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ చిత్రం కూడా మే లోనే సినిమా విడుదల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.గోపీచంద్ హీరోగా సంపత్ నంది తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా సీటీమార్. ఈ చిత్రం మే చివ‌రి వారంలో విడుద‌ల‌కు సన్నాహాలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: