సాధారణంగా సినిమా పరిశ్రమ అంటే హిట్టున్నవాడే రాజా..అన్నట్లు ఉంటుంది.  కొత్తగా వచ్చిన హీరోకి వరుసగా రెండు మూడు హిట్స్ ఉంటే దర్శక, నిర్మాతలు పనికట్టుకొని ఆ హీరో ఇంటికి క్యూ కడుతుంటారు.  పెళ్లిచూపులు సినిమాతో విజయం అందుకున్న విజయ్ దేవరకొండ తర్వాత అర్జున్ రెడ్డి మూవీతో బాక్సాఫీస్ షేక్ చేశాడు.  ఇక గీతాగోవిందం మూవీతో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. అయితే వరుస హిట్స్ సాధించిన ఏ హీరోకి అయినా సినీ పరిశ్రమలో రెడ్ కార్పేట్ వేస్తుంటారు. అదే ఎంత పెద్ద హీరో అయినా కెరీర్ లో ఎన్ని విజయాలు సాధించినా వరుస ఫెయిల్యూర్స్ వచ్చాయంటే ఆ హీరోపై రక రకాల అభిప్రాయాలు వెల్లబుచ్చుతుంటారు.  దర్శక, నిర్మాతలు సైతం ఆ హీరోతో సినిమా తీస్తే మార్కెట్ ఉంటుందా.. దెబ్బతింటుందా అన్న సందేహంలో పడిపోతుంటారు. ఇప్పుడు ఇదే పరిస్థితి మాస్ మహరాజ రవితేజకు వచ్చిందని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. 

 

ఒకప్పుడు మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా రవితేజ బిజీ హీరోగా ఉండేవారు.  పవర్ తర్వాత రవితేజకు వరుస ఫ్లాపులు రావడం మొదలయ్యాయి.  ఆ మద్య అనీల్ రావిపూడి తెరకెక్కించిన రాజాది గ్రేట్ మూవీతో మంచి విజయం అందుకున్నాడు.  వెంటనే రవితేజకు వరుస ఆఫర్లు రావడం అవి కాస్తా బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడటంతో మొన్నటి వరకు డిస్కోరాజా పై ఆశలు పెట్టుకున్నారు. 

 

మూవీ కూాడా ఫ్లాప్ టాక్ రావడంతో ఇప్పుడు రవితేజతో సినిమాలు తీయడానికి నిర్మాతలు కాస్త వెనుకడుగు వేస్తున్నారని టాలీవుడ్ టాక్.  ప్రస్తుతం క్రాక్ సినిమాలో నటిస్తున్న రవితేజ గత ఏడాది అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 సీక్వెల్ ఎఫ్ 3 మూవీలో నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఈ మూవీ నిర్మాత దిల్ రాజు మాత్రం రవితేజ మార్కెట్ విషయంలో కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారట.. కానీ అనీల్ రావిపూడి గతంలో రాజాది గ్రేట్ హిట్ దృష్టిలో పెట్టుకొని రవితేజకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారట.  మరి నిర్మాత, దర్శకుల మద్య ఎలాంటి చర్చలు జరుగుతాయి.. అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఏం రానున్నదో అని రవితేజ ఫ్యాన్స్ తెగ టెన్షన్ పడిపోతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: