ఉత్తరప్రదేశ్ లోని ఘటన మొత్తం దేశాన్నే విస్మయపరిచింది. మన దేశంలో అమ్మాయిలపై అబ్బాయిలు యాసిడ్ పోసిన ఘటనలు కొన్ని వేలకు పైగా ఉన్నాయి. ఒక అమ్మాయి వెంటపడి ప్రేమించమని తిరగడం... అతని ప్రేమను అంగీకరించకపోతే ఆమెపై యాసిడ్ దాడి చేయడం చాలా సాధారణమైన విషయం అయిపోయింది. అయితే ఇప్పుడు కాలం మారింది. ఈసారి ఒక అమ్మాయి అబ్బాయి పై యాసిడ్ పోసింది.

 

వివరాల్లోకి వెళితే బాధితుడు అయిన రోహిత్ యాదవ్ క్లీనర్ గా పని చేస్తూ ఉంటాడు. అయితే నిన్నటి ఉదయం నుండి అతను ఒక అమ్మాయి దగ్గరలో ఉన్న డైరీలో దాక్కొని ఉండడం గమనిస్తూ ఉన్నాడట. అయితే ఏమైందో తెలియదు కానీ ఒక్కసారిగా అమ్మాయి కొద్దిసేపటికి వచ్చి అతని పై యాసిడ్ దాడి చేసింది. ఇదేదో కొంచెం తేడా కొడుతుంది కదూ..?

 

పోలీసులు కూడా ఇదే అనుమాన పడుతున్నాడు. వారి మొదటి విచారణలో అనుమాన పడుతుంది ఏమిటంటే ఇది ఏదో వన్ సైడ్ లవ్ కేస్ లాగా ఉందని.. 24 ఏళ్ల అబ్బాయి 20 ఏళ్ల అమ్మాయిని ప్రేమించమని టార్చర్ పెడుతూ ఉంటే ఆమె ప్లాన్ చేసి అతనిపై సమయం చూసి యాసిడ్ పోసినట్లుగా వారు అనునానిస్తున్నారు. అయితే ఇక్కడ ఎవరికీ అర్థం కాని విషయం ఏమిటంటే అలా యాసిడ్ దాడికి గురైన తర్వాత కూడా అబ్బాయి ఇంకా ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదట. ఇకపోతే అబ్బాయి కంప్లైంట్ ఇవ్వనిదే అమ్మాయి మీద పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోరు.

 

ఇకపోతే స్థానికులు దాడికి గురైన అబ్బాయిని గురించి పోలీసుల కు సమాచారం ఇచ్చి వెంటనే హాస్పిటల్ కు తరలించగా అబ్బాయికి వీపు భాగం, చాతీ భాగం మరియు ఎడమ భుజం దగ్గర చాలా కాలిన గాయాలు ఉండిపోయాయి. ప్రథమ చికిత్స అయిన తర్వాత అతనిని మెరుగైన చికిత్స కోసం లక్నో లోని హాస్పిటల్ కు తరలించడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: