సౌత్ స్టార్ హీరోయిన్
అనుష్క,
తమిళ నటుడు మాధవన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం నిశ్శబ్దం. గత ఏడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 31 న విడుదలకావాల్సి ఉంది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో విడుదలను వాయిదా వేశారు. దాంతో సినిమాను
ఫిబ్రవరి లో విడుదలచేస్తారని టాక్ వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం నిశ్శబ్దం
ఫిబ్రవరి లో కాదు ఏప్రిల్ 2న విడుదలకానుందని తెలుస్తుంది. ఈరిలీజ్ డేట్ ను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించింది.
హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తున్న ఈ సస్పెన్స్
థ్రిల్లర్ లో సుబ్బరాజు, అంజలి , అర్జున్
రెడ్డి ఫేమ్ షాలిని పాండే తో
హాలీవుడ్ నటుడు మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. కోన ఫిలిం కార్పొరేషన్ ,పీపుల్
మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై
కోన వెంకట్, టిజి
విశ్వ ప్రసాద్ ఈచిత్రాన్ని సంయుక్తం
గా నిర్మిస్తున్న ఈ చిత్రానికి
గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. నిశ్శబ్దం తెలుగు తోపాటు
తమిళ ,
హిందీ , ఇంగ్లీష్ భాషల్లో కూడా విడుదలకానుంది.
ఇదిలావుంటే
అనుష్క కెరీర్ ప్రస్తుతం డైలమాలో పడింది. 2018 ప్రారంభం లో
భాగమతి తో ప్రేక్షకులు ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది అనుష్క. అయితే ఆ సినిమా తరువాత వచ్చిన అవకాశాలను దూరం చేసుకొని చాలా గ్యాప్ తీసుకుంది. ఇక ఎట్టకేలకు గత ఏడాది నిశ్శబ్దం
సినిమా కు ఒప్పుకొని దాన్ని పూర్తి చేసింది. అయితే ఈ గ్యాప్ లో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రస్తుతం
అనుష్క చేతిలో ఒక్క ఆఫర్ కూడా లేదు. నిశ్శబ్దం విడుదలై విజయం సాధిస్తే తప్ప
అనుష్క కెరీర్ మళ్ళీ గాడిలో పడదు.