బాహుబలి సినిమాతో ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. ఇండియాలో మోస్ట్ క్రేజ్ ఉన్న హీరోగా ప్రభాస్ కి స్థానం ఉంది. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకి ప్రభాస్ కి మాంచి క్రేజ్ ఉంది. అంతటి క్రేజ్ ఉన్న హీరోలు ప్రయోగాలు చేయడానికి జంకుతారు. కానీ ప్రభాస్ మాత్రం అలా కాదు. బాహుబలి బిగ్గెస్ట్ హిట్ తర్వాత ఎవరైనా టాప్ మోస్ట్ డైరెక్టర్ తో సినిమా చేయాలని అనుకుంటారు. కానీ ప్రభాస్ అందుకు విరుద్ధంగా కేవలం ఒకే ఒక్క సినిమా తీసిన సుజిత్ తో సాహో సినిమా చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. 

 

 

పాన్ ఇండియా చిత్రంగా విడుదల అయిన సాహో బాలీవుడ్ మినహా విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. బాహుబలి ద్వారా ప్రభాస్ సంపాదించుకున్న స్టార్ స్టేటస్ వల్ల ఈ సినిమాకి కలెక్షన్లు బాగానే వచ్చాయి.అయితే యంగ్ డైరెక్టర్ తో చేసిన సాహో సినిమా పరాజయం పాలవడంతో మళ్ళీ కొత్త దర్శకులతో సినిమా చేయడని అందరూ అనుకున్నారు. కానీ ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం ప్రభాస్ కొత్త దర్శకుల కోసం వెయిట్ చేస్తున్నాడట.

 

 

ప్రభాస్ ప్రస్తుతం రాధాక్రిష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జాన్ అనే అనధికార టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ సినిమా అనంతరం ప్రభాస్ కొత్త దర్శకులతో చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. ఇప్పటికే కొంత మంది దర్శకులని కలిశాడని సమాచారం. కొత్త దర్శకులు చేసిన సినిమాలు చూస్తున్నాడట. కొత్త దర్శకులు కథలు తీసుకువస్తే వినడానికి సిద్ధంగా ఉన్నాడట.

 

 

సాహో సినిమాతో చేతులు కాల్చుకున్న ప్రభాస్, మళ్లీ రిస్క్ తీసుకోవడం మంచిది కాదని భావిస్తున్నారు. కానీ కొత్త దర్శకులతో లిమిటెడ్ బడ్జెట్ లో మువీ తీస్తే మార్కెట్ పరంగా మంచి లాభాలు వస్తాయని అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఏదేమైనా కొత్త దర్శకులతో వెళ్తే కొత్త కథలు వస్తాయి. ప్రభాస్ లాంటి పెద్ద హీరోలని కొత్త కథల్లో చూసుకోవాలని అభిమానులకి మాత్రం ఉండదా..?

మరింత సమాచారం తెలుసుకోండి: