పవన్ కళ్యాణ్ సినిమా అంటే మాములుగా ఉండదు. అజ్ఞాతవాసి సినిమా తరువాత జగన్ మరో సినిమా చేయలేదు. రాజకీయాల్లో బిజీ అయ్యారు. పవన్ గురించి ఆయన స్నేహితుడు త్రివిక్రమ్ ఇటీవలే ఓ మాట చెప్పారు. పవన్ కు సినిమాలు ఎప్పుడు సెకండ్ ప్రయారిటీనే. సినిమా చేసినా కూడా ఆ సినిమాను థియేటర్లో చూడటానికి చాలా సమయం తీసుకుంటారు. అందరిలా కాదు అని అన్నారు. అత్తారింటికి దారేది సినిమా థియేటర్లో 100 రోజుల తరువాత చూశారు. అదీ కూడా ఎంతో బతిమిలాడితే అన్నారు.
ఎన్నికల తరువాత పవన్ రాజకీయాల్లో కొంత బిజీగా ఉన్నప్పటికీ గతంలో తాను ఇచ్చిన హామీ ప్రకారం సినిమాలకు కొంత సమయం కేటాయించారు. ఇచ్చిన సమయంలో సినిమాలు చేస్తూ, ఇటు రాజకీయాల్లో కూడా బిజీ అయ్యారు. రైతులకు ఇచ్చిన మాటకోసం తన మాటను నిలబెట్టుకుంటామని, రైతుల కోసం పోరాటం చేస్తానని పవన్ ఇప్పటికే చెప్పారు. చెప్పినట్టుగానే చేస్తున్నారు. మరోవైపు గతంలో నిర్మాతలకు ఇచ్చిన మాట కోసం సినిమాలు చేస్తున్నారు.
ఇది రెండు పడవల మీద కాలు పెట్టడమే అయినా తప్పడం లేదు. రెండు పడవల మీద కాలు పడితే కొంత ఇబ్బందే కానీ తప్పదు. ప్రస్తుతం దిల్ రాజ్ నిర్మాణంలో పింక్ రీమేక్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాణం దశలో ఉండగానే జూన్ 29 వ తేదీన ఏఎం రత్నం నిర్మాణంలో క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభం అయ్యింది. ఔరంగజేబు కాలం నాటి కథతో సినిమా ప్రారంభం అయ్యింది. ఇది పాన్ ఇండియా మూవీ అని తెలుస్తోంది.
ఇందులో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్ర చేయబోతున్నారు. ఈ పాత్రకు కోసం క్రిష్ చాలా కష్టపడి డిజైన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇందుకోసం ప్రత్యేకమైన సెట్స్ ను ఏర్పాటు చేశారట. ఈ ప్రత్యేక సెట్స్ లోనే సినిమా షూట్ చేయబోతున్నారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండబోతున్నారు. అందులో ఒకరు బాలీవుడ్ నుంచి ఉంటారని తెలుస్తోంది. అయితే ఆ హీరోయిన్ ఎవరు ఏంటి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. సినిమా మాత్రం సూపర్ గా ఉంటుందని క్రిష్ అంటున్నాడు.