కాళిదాసు సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సుశాంత్.. ఆ తర్వాత చేసిన ఏ సినిమా కూడా అతనికి విజయాన్ని ఇవ్వలేదు.  కరెంట్ సినిమా మ్యూజిక్ పరంగా ఫర్వాలేదనిపించినా సినిమా పరంగా తక్కువ మార్కులే పడ్డాయి. అయితే ఏడాదికో, రెండేళ్లకో ఒక సినిమా చేసుకుంటూ మెల్లగా కెరీర్ బండిని లాగుకొస్తున్న సుశాంత్ కి గత ఏడాది "చి.ల. సౌ" రూపంలో మంచి హిట్ లభించింది.

 

 

చిలసౌ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. రాహుల్ రవీంద్ర అనే నటుడు ఈ సినిమాతో దర్శకుడిగా మారాడు. చిలసౌ సినిమా బాగున్నప్పటికీ నటుడిగా సుశాంత్ కి పేరు తీసుకురాలేదు. హీరోగా విజయాలు లేకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ట్రై చేద్దామని అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంలో నటించాడు.

 

 

ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బంపర్ హిట్ అయింది. కానీ ఈ సినిమాలో సుశాంత్ పాత్ర చెప్పుకోదగినదిగా లేదు. అసలేమాత్రం ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ లో నటించడంతో సుశాంత్ కి ఎలాంటి లాభం చేకూరలేదు. అయితే ప్రస్తుతం సుశాంత్ మళ్లీ హీరోగా మనముందుకు వస్తున్నాడు. ఈ రోజు ప్రారంభం కానున్న ఈ చిత్రానికి ఆసక్తికర టైటిల్ ని పెట్టారు. ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే టైటిల్ తో తెరకెక్కనున్న తాజా చిత్రం నేడు అధికారికంగా ప్రారంభం కానుంది.

 

 

దర్శక నిర్మాతలతో పాటు టాలీవుడ్ ప్రముఖుల సమక్షంలో నేడు పూజ కార్యక్రమాలతో సినిమా ప్రారంభిస్తున్నారు. meenakshi NAIDU' target='_blank' title='మీనాక్షి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో స్టార్ కమెడియన్స్ వెన్నెల కిషోర్, ప్రియదర్శి నటిస్తున్నారు. దర్శకుడు దర్శన్ ఎస్ ఈ చిత్రాన్ని ఓ నూతన కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారని సమాచారం. ఏ ఐ స్టూడియోస్, సహస్త్ర మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం ప్రవీణ్ లక్కరాజు అందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: