మహేష్ బాబు కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు.  అయితే కెరీర్ బిగినింగ్ లో కొన్ని ఫ్లాపులు ఎదుర్కొన్నారు. అలాంటి వాటిలో  2002లో విడుదలైన బాబీ  మూవీ ఒకటి.  అయితే ఈ మూవీలో మహేష్ బాబు స్నేహితుడిగా నటించాడు ప్రముఖ దర్శకులు మెహర్ రమేష్. ఆ తర్వాత 2004లో ఆంధ్రావాలా మూవీ కన్నడంలో వీర కన్నడిగగా రిమేక్ చేసి దర్శకుడిగా మారాడు. 2008లో జూనియర్ ఎన్. టి. ఆర్ హీరోగా కంత్రితో తెలుగు సినిమారంగంలో దర్శకుడిగా అడుగుపెట్టాడు. కంత్రి, బిల్లా, శక్తి  లాంటి మూవీస్ స్టార్ హీరోలతో తీసినా ఈ దర్శకుడికి పెద్దగా కలిసి రాలేదు.  దాంతో కష్టాల్లో పడ్డ ఈ దర్శకుడికి మహేష్ బాబు చేయూత ఇచ్చారు.   మహేష్‌బాబుతో చిన్న చిన్న యాడ్స్ చేస్తున్న ఈ దర్శకుడికి మహేష్‌ బాబు మంచి బూస్టు ఇచ్చారు.  

 

ఇదే కాదు ఈ మద్య ‘సరిలేరు నీకెవ్వరు’ తో మరో బంపర్ ఆఫర్ ఇవ్వడంతో ఈ దర్శకుడి దశ పూర్తిగా తిరిగిపోయిందని అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. మహేష్ సహకారంతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా గుంటూరు రైట్స్‌ మెహర్‌ రమేష్‌ దక్కించుకున్నారు. దాంతో మొదటే అక్కడ అడ్వాన్సుల రూపంలోనే ఆయన పెట్టుబడి వచ్చేసింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం, కలెక్షన్లు కూడా దుమ్మురేపటంతో మెహర్‌కు భారీ లాభాలు వచ్చాయని ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.  అయితే ఈ మూవీ ఇంతమంచి హిట్ అవుతుందని ముందే ఊహించి ఈ దర్శకుడు ముందడుగు వేసినట్లు సమాచారం.

 

అప్పటి వరకు తనకు ఉన్న ఫైనాన్స్ ఒత్తిడిలన్నీ దూరం చేసుకున్నారట. మహేష్‌బాబు అండతో డిస్ర్టిబ్యూటర్‌ అవతారమెత్తి, తొలి చిత్రంతోనే భారీ సక్సెస్ అందుకున్న మెహర్‌ రమేష్‌ ఇక ముందు కూడా ఇదే బాటలో నడవాలనే యోచనలో ఉన్నారట. అన్నీ కుదిరితో మరో మూవీకి డైరెక్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదని అనుకుంటున్నారు టాలీవుడ్ వర్గాలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: