ఎనర్జిటిక్  హీరో రామ్ గత ఏడాది ఇస్మార్ట్ శంకర్  తో కెరీర్ లో మొదటి  బ్లాక్ బాస్టర్  హిట్ కొట్టాడు.  అంతేకాదు జులై లో విడుదలైన ఈ చిత్రం 60కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి రామ్  కెరీర్ లోనే  అత్యధిక  వసూళ్లను సాధించిన  చిత్రం గా రికార్డు సృష్టించింది.  ఈచిత్రంలోఊర మాస్ పాత్రలో నటించి రామ్ ఆకట్టుకున్నాడు. ఇక ఈసినిమా తరువాత ఇప్పుడు మరో సారి డిఫ్రెంట్ రోల్ లో కనిపించనున్నాడు రామ్.  అందులో భాగంగా ప్రస్తుతం రామ్,  కిషోర్ తిరుమల  డైరెక్షన్ లో రెడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. సెట్స్ మీదకు  వెళ్ళినప్పటినుండి  ఈచిత్రం నాన్ స్టాప్ గా షూటింగ్ జరుపుకుంటుంది. 
 
 కోలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ  తడం కు రీమేక్  గా  తెరకెక్కుతున్న ఈచిత్రంలో రామ్ సరసన  నేల టిక్కెట్టు  ఫేమ్ మాళవిక శర్మ అలాగే చిత్రలహరి ఫేమ్ నివేత పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా  వీరితో పాటు మరో బ్యూటీ  కీలక పాత్రలో కనిపించనుంది. ఆమె ఎవరో  కాదు తమిళ స్థార్ హీరో విజయ్ నటించిన  బిగిల్ లో ఫుట్ బాల్ ప్లేయర్ గా నటించిన అమ్రితా నయ్యర్..  తెలుగులో ఆమెకు ఇదే మొదటి సినిమా.. 
 
 శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్ పై రామ్ బాబాయ్  స్రవంతి రవి కిషోర్  నిర్మిస్తున్న ఈ చిత్రానికి  సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ  సంగీతం అందిస్తుండగా ఏప్రిల్ 9న  ఈచిత్రం విడుదలకానుంది. ఇక రామ్ - కిషోర్ తిరుమల  కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో  నేను శైలజ ,ఉన్నది ఒకటే జిందగీ  చిత్రాలు తెరకెక్కగా అందులో  నేను శైలజ సూపర్ హిట్ అవ్వగా రెండో సినిమా యావరేజ్ అనిపించుకుంది. మరి రెడ్ వీరికి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: