యాంకర్ శ్రీముఖి ఎంతో బాగా మాట్లాడుతూ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. స్వీట్ వాయిస్ తో, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో ఎంటర్టైన్ మెంట్ ఇస్తుంది ఈ అందాల భామ. నవ్వుతూ, నవ్విస్తూ అందరినీ మెప్పిస్తుంది. కామిడీ తో ఇనోసెన్స్ తో ఎంత గానో ఆకట్టుకుంది ఈ కుందనాల బొమ్మ. చలాకీ గా స్టేజ్ మీద స్టెప్పు లేసి ఒసేయ్ రాములామ్మా అని చిందులు వేస్తుంది.

ఇలా ఎన్నో ప్రోగ్రాముల తో టీవి లో కి వచ్చేస్తుంది. వస్తే వచ్చింది కానీ టీవి ని కట్టనివ్వకుండా చేస్తుంది. చాలా బాగా మాట్లాడుతూ అలుపు కి కూడా ఊపు ని అందించేస్తుంది శ్రీముఖి. పటాస్ వంటి షో ల్లో తనదైన శైలి తో చక్కటి ప్రదర్శనలని ఇచ్చింది ఈ అందాల రాశి. శ్రీముఖి బిగ్ బాస్ షో లో కూడా చక్కటి ప్రదర్శన అందించింది. తన అల్లరి, కామిడీ, ఇనోసెన్స్, టైమింగ్, ధైర్యం, ఆట కి పోటీ లాంటివి ఎంతో చెప్పుకో తగినవి. శ్రీముఖి ప్రదీప్, రవి వంటి యాంకర్స్ తో కలీస్తే ఆ ఎనర్జీ డోస్ డబుల్ అవ్వాల్సిందే.

ఇటీవలే శ్రీముఖి కి ద మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ ఆన్ టీవి అవార్డు రావడం గొప్ప విషయం. హైదరాబాద్ టైంస్ పత్రిక వారు ఈ అవార్డులు ని ఎంపిక చేసి విజేతని ప్రకటిస్తారు. అయితే తాజా గా ఈ పోటీ కి ఎంట్రీ ఇచ్చి పోలింగ్ ని నిర్వహించారు. ఆ పోల్ లో శ్రీముఖి కి అధిక ఓట్లు వచ్చాయి. విన్నర్ గా నిలిచింది. నెంబర్ వన్ స్థానం దక్కించుకుంది. తో మంది సీనియర్ యాంకర్లు ఉన్నా శ్రీముఖి కి రావడం నిజం గా విశేషం. ఆమె టాలెంట్ కి జోహార్లే.
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: