సూపర్ స్గార్ రజినీకాంత్ నటించే సినిమాలంటే ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  రజనీకాంత్‌, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా దర్భార్. జనవరి 9న విడుదలైన ఈ సినిామ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే రాబట్టింది. అయితే ఈ మూవీలో కొన్ని డైలాగ్స్‌కి ఆడియన్స్ థియేటర్లో కూర్చున్న ఆడియన్స్ కి పూనకాలే వచ్చేలా ఉన్నాయి.   నయనతార హీరోయిన్ గా నటించిన ఈ   ‘దుమ్ము దూళి’ అనే పల్లవితో వచ్చే సాంగ్ యుట్యూబ్లో ట్రెండింగ్ గా మారింది.  సౌత్‌ స్టార్‌ డైరెక్టర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ లైకా ప్రొడక్షన్స్‌లో శుభకరణ్ నిర్మించారు. గత మూడు దశాబ్దాలుగా ఆయన సౌత్‌లో అన్ని భాషల్లో తనదైన ముద్ర వేసిన రజినీకాంత్ కి కొంత కాలంగా అస్సలు కలిసి రావడం లేదనే చెప్పాలి.  

 

ఆయన నటించిన లింగ మూవీ దగ్గర నుంచి బ్యాడ్ టైమ్ మొదలైంది.  ఈ మూవీ తర్వాత వచ్చిన కబాలి, కాలా దారుణమైన ఫ్లాపులు అయ్యాయి. ఆ తర్వాత పెట్టా మూవీ కాస్త పరవాలేదు అనిపించింది. ఇదే క్రమంలో మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన దర్భార్ మూవీపై తెలుగు రాష్ట్రాల్లో ఆడియన్స్ పెదవి విరిచారు. ఇదే సమయంలో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో బాక్సాఫీస్ హిట్ అయ్యాయి.  తెలుగు రాష్ట్రాల్లో అలా అలా సాగింది రజినీ ప్రయాణం.  

 

ఇక తమిళంలో హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బయ్యర్లకు మాత్రం అంతంత మాత్రమే అంటున్నారు. దాంతో వారు నిర్మాతను కలిసారు. కాగా బయ్యర్లతో పాటు నిర్మాత కూడా రజినీకాంత్‌ను కలవబోతున్నారు. ఆయనను కలిసి వారికి ఏదో మార్గం చూపించమని వెళ్లనున్నారట. అయితే ఈ విషయం పై రజినీ కూడా సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు ఈ మూవీ కోసం ఆయన 50 శాతం తిరిగి ఇచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. గతంలో కూడా రజినీకి ఇలాంటి కష్టాలు ఎదురయ్యాయి. బాబా సినిమాకు రజినీ మొత్తం డబ్బులు తిరిగి ఇచ్చారట. కాగా లింగా సినిమాకు కూడా ఆయన కొన్ని డబ్బులను తిరిగిచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: