వరుసగా ‘భరత్ అనే నేను’ మరియు ‘మహర్షి’ లాంటి రెండు సూపర్ డూపర్ విజయాలు సాధించాడు మహేష్ బాబు. దీంతో సంక్రాంతి పండుగ ను టార్గెట్ చేసుకుని ఎలాగైనా హ్యాట్రిక్ విజయం సాధించాలని అనిల్ రావిపూడి దర్శకత్వం లో సరిలేరు నీకెవ్వరు సినిమా స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అతి తక్కువ కాలంలోనే సినిమాని కంప్లీట్ చేయడం జరిగింది. కమర్షియల్ ప్లస్ కామెడీ తరహాలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11 వ తారీకున రిలీజ్ అయ్యి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మహేష్ బాబు మాస్ పెర్ఫార్మన్స్ కి అదేవిధంగా గతంలో ఏ సినిమా లో వెయ్యని డాన్స్ ఈ సినిమాలో మహేష్ వేయడంతో..సినిమా అదిరిపోయే రేంజ్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ విజయాన్ని నమోదు చేసుకుంది.

 

దీంతో మొన్నటి వరకు ఈ సినిమా సక్సెస్ సంబరాల్లో సినిమా యూనిట్ పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం మహేష్ తన కుటుంబ సమేతంగా ఈ సినిమా సక్సెస్ ని అమెరికా దేశం న్యూయార్కులో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకి సంబంధించి విజయంపై హీరో కృష్ణ స్పందించారు. ముందుగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహేష్ ఈ చిత్రంలో బాగా నటించాడని, సినిమా చాలా ఎంటర్ టైనింగ్‌గా, ఎక్స్ట్రార్డినరీగా ఉందన్నారు.‌

 

‘బ్లాక్ బస్టర్‌ కా బాప్‌’‌గా సినిమా ఉందని, అలాగే నిర్మాత కాంప్రమైజ్ అవ్వకుండా డబ్బులు ఖర్చు పెట్టారని, డైరెక్టర్ అనిల్ రావిపూడి ఎక్కడా ఎలాంటి బోర్ కొట్టకుండా సినిమా తీశారని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగకు విడుదలైన ఈ సినిమా మహేష్ బాబు పక్కన హీరోయిన్ గా రష్మిక మందన నటించింది. అంతేకాకుండా దాదాపు 13 సంవత్సరాల తర్వాత విజయశాంతి ఈ సినిమాలో నటించడం జరిగింది. ఇంకా చాలా మంది సీనియర్ నటీనటులు సినిమాలో నటించి అద్భుతంగా సినిమా హిట్ అవడానికి తోడ్పడటం జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: