యువ సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలకు సంగీతం అందించడం జరిగింది. అంతకముందు మెగాస్టార్ చిరంజీవి నటించిన ఖైది నెంబర్ 150 సినిమాకు సూపర్ హిట్ సాంగ్స్ ని అందించిన దేవి, ఇటీవల మహేష్ నటించిన మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలకు మాత్రం ఆశించిన రేంజ్ లో మ్యూజిక్ ని మాత్రం అందిచలేకపోయాడనే విమర్శలు కొద్దిరోజులుగా వెల్లువెత్తుతున్నాయి. నిజానికి కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ నటించిన భరత్ అనే నేను కు అడిగిపోయే సాంగ్స్ ఇచ్చిన దేవి, 

 

అనంతరం వచ్చిన మహర్షి, అలానే ఇటీవల సరిలేరు సాంగ్స్ ని కూడా అనుకున్న స్థాయిలో ఇవ్వలేకపోవడంతో, ఆయనకు ఇకపై అవకాశాలు ఇవ్వడంలో కొందరు దర్శక, నిర్మాతలు కూడా వెనకడుగు వేస్తున్నట్లు టాక్. అయితే దీనికి మరొక కారణం కూడా ఉందట, అదేమిటంటే, ఇటీవల పెద్ద గ్యాప్ తీసుకుని రీఎంట్రీ ఇచ్చిన థమన్ మొన్నటి అలవైకుంఠపురములో కానీ అంతకముందు కంపోజ్ చేసిన అరవింద సమేత, తొలిప్రేమ, మహానుభావుడు, సినిమాల్లోని సాంగ్స్ ని పరిశీలిస్తే అతడు ఎంతలా దూసుకుపోతున్నాడో అర్ధం చేసుకోవచ్చు. అయితే దేవి మాత్రం ఎప్పుడూ అవే ట్యూన్స్ ని మార్చి మార్చి ఇస్తున్నాడనే వాదన కూడా వినపడుతోంది. 

 

దీనితో ప్రస్తుతం దేవి చేతిలో అల్లు అర్జున్, సుకుమార్ సినిమా తప్పించి మరొక పెద్ద సినిమా లేదు. మరోవైపు మణిశర్మ కూడా రీఎంట్రీ తో వరుసగా అవకాశాలు చేజిక్కించుకోవడం కూడా దేవికి పెద్ద దెబ్బేసింది. మరి ఇకనైనా దేవి తన పద్ధతి మార్చుకుని, తాను అందించే సాంగ్స్ మరింత క్వాలిటీ గా అలానే ఆడియన్స్ ని అలరించేలా అందిస్తాడేమో చూడాలి. లేదంటే అతడి పరిస్థితి రాబోయే రోజుల్లో మరింత కష్టంగా మారుతుందని అంటున్నారు....!!! 

మరింత సమాచారం తెలుసుకోండి: