టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇటీవల యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అయి మంచి సక్సెస్ ని అందుకుంది. మహేష్ బాబు ఒక మిలిటరీ మేజర్ గా నటించిన ఈ సినిమాని ఒక ఫక్తు కమర్షియల్ ఎంటర్టైనర్ గా చిత్రీకరించిన దర్శకుడు అనిల్ రావిపూడి, మహేష్ బాబులోని ఫుల్ లెంగ్త్ కామెడీ యాంగిల్ ని ఈ సినిమాలో వాడుకోవడం జరిగింది. అయితే చాలా ఏళ్ళ నుండి ఈ తరహా కామెడీ, యాక్షన్ సినిమాలో మహేష్ నటించకపోవడంతో ఆయన ఫ్యాన్స్ తో పాటు పలువురు ప్రేక్షకులు సైతం మహేష్ అత్యద్భుత నటనను చూసేందుకు థియేటర్స్ కు క్యూ కట్టారు. 

 

ఇకపోతే ప్రస్తుతం తన ఫ్యామిలీ తో కలిసి హ్యాపీ గా సరిలేరు సక్సెస్ ని అమెరికా, దుబాయ్ దేశాల్లో ఎంజాయ్ చేస్తున్న సూపర్ స్టార్, మరొక రెండు నెలల తరువాత ఇండియాకి తిరిగి వచ్చిన అనంతరం యువ దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలోని సినిమాలో నటిస్తారు. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో గత ఏడాది వచ్చిన మహర్షి సినిమా మంచి హిట్ అందుకోవడంతో, అతి త్వరలో తెరకెక్కబోయే ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో సైతం విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్నాయి. మాఫియా బ్యాక్ డ్రాప్ లో మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో తొలిసారిగా మహేష్ బాబు డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి వార్తలు వస్తున్నాయి. 

 

ఒకటి పక్కా మాస్ క్యారెక్టర్ అయితే, మరొకటి మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడిన పాత్ర అని అంటున్నారు. ఇక ఈ సినిమాలో నటించే ఇద్దరు హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా ఇటీవల రామ్ సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఎంపికైనట్లు చెప్తున్నారు. అలానే సంగీత దర్శకుడిగా ఎస్ ఎస్ థమన్ వ్యవహరించనున్న ఈ సినిమాని మహేష్ బాబు, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మిచనున్నారట. అయితే ఈ వార్తపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేనప్పటికీ, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఇది డబుల్ బొనాంజ న్యూస్  అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు......!!

మరింత సమాచారం తెలుసుకోండి: