ఏ ఎం రత్నం నిర్మించిన నీ మనసకు నాకు తెలుసు సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన త్రిష కృష్ణన్ ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో. త్రిష డేట్స్ కోసం పెద్ద దర్శకులు, నిర్మాతలు కూడా ఎదురుచూసే రేంజ్ కి చేరుకుంది. తెలుగులో పాటు తమిళంలోనూ వరుసగా అవకాశాలు అందుకుంది. అయితే కొన్నేళ్లుగా తెలుగులో త్రీహకి అవకాశాలు రావడం లేవు. ‘నాయకి’ తరవాత తెలుగులో ఈ బ్యూటి కనిపించనేలేదు. దాదాపు మూడేళ్ళు తెలుగులో త్రిష ఒక్క సినిమా కూడా ఛాన్ రాలేదు. అయితే గత ఏడాది 96 సినిమాతో కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకొని బౌన్స్ బ్యాక్ అయింది. దాంతో చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాతో పాటు 1818 అనే మరో సినిమాలో కూడా త్రిష నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటుంది.

 

ఇక శ్రుతిహాసన్‌ కూడా ‘కాటమరాయుడు’ తరవాత ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. ఈ సినిమా 2017 లో వచ్చింది. ప్రస్తుతం ఉన్న అందాల భాల తాకిడికి తట్టుకోలేక శ్ర్తి కాస్త వెనకబడింది. అయితే లక్కీగా రవితేజ సినిమాలో నటించే ఛాన్స్ ని అందుకుంది. రవితేజ - గోపీచంద్‌ మలినేని కాంబోలో  తెరకెక్కుతున్న ‘క్రాక్‌’ సినిమాలో శ్రుతిని హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకున్నారు. గతంలో ‘బలుపు’ సినిమాలో రవితేజ-శ్ర్తిహాసన్ కలిసి నటించిన సంగతి తెలిసిందే.

 

ఉత్తమ నటిగా ప్రియమణి పెళ్ళైన కొత్తలో సినిమాకి గాను జాతీయ ఉత్తమనటి అవార్డు ను సొంతం చేసుకుంది. స్టార్ హీరోల తో పాటు కుర్ర హీరోలతోనూ ఆడిపాడింది. అయితే పెళ్ళి తర్వాత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంది ప్రియమణి. ఇప్పుడు తిరిగి ప్రియమణి వరుసగా మంచి అవకాశాల్ని అందుకుంటోంది. రానా నటిస్తున్న ‘విరాటపర్వం’ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తోంది. విక్టరీ వెంకటేష్‌ ‘నారప్ప’ సినిమాలోనూ ప్రియమణి హీరోయిన్. ఈ రెండు సినిమాలలోనూ పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రల్లో నటిస్తోంది. ఇక బాలీవుడ్ లో కూడా ఒక సినిమా చేస్తుంది ప్రియమణి. ఫ్యామిలీ మాన్ వెబ్ సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. మొత్తానికి కొన్నాళ్ళు అవకాశాలు లేక ఖాలీగా ఉన్న ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ తిరిగి మళ్ళీ ఫాం లోకి రావడం గొప్ప విషయం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: