ఇండస్ట్రీలో ఎక్కువ మంది వారసులు ఉన్న ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అని ఒప్పుకోవాల్సిందే. అంతే కాదు ఎక్కువ సక్సెస్ అయిన వారసులు కూడా మెగా ఫ్యామిలోలోనే ఉన్నారు. ఒక్క అల్లు శిరీష్ తప్పితే మిగతా అందరూ దాదాపుగా సక్సెస్ ట్రాక్ లోనే ఉన్నారుయ్. మళ్లీ వీరు ఎంచుకునే దారులు కూడా కొత్తగా ఉంటున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో భిన్నమైన దారిలో వెళ్తున్నారు. బహుశా అదే వారికి సక్సెస్ మంత్రంలా పనిచేస్తుందేమో.

 

 

ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుండి మరో కొత్త హీరో వైష్ణవ తేజ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ "ఉప్పెన "చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయం కాబోతున్నాడు. ఈ మధ్య రిలీజైన ఫస్ట్ లుక్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచింది. హీరో ముఖం కనిపించకుండా సముద్రానికేసి చూస్తూ సాధించానన్న నమ్మకంతో చేతులు పైకెత్తిన ఫోటో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

 

 

అయితే ఈ సినిమాకి అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమిళ హీరో విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తున్నాడట. అందుకోసం విజయ్ గట్టిగానే అడిగాడట. అదీ కాకుండా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మళ్ళీ అనుకున్న దానికంటే సినిమా షూటింగ్ లేట్ అవడం వల్ల కూడా ఖర్చు పెరిగిపోతుందట. అయితే ఒక డెబ్యూ హీరో సినిమా హీరోకి ఇంతలా ఖర్చు చేయడం అవసరమా అంటున్నారు.

 

 

కానీ మెగా వారసుడిని లాంచ్ చేస్తున్నారన్న కారణంగా ఈ సినిమా బడ్జెట్ పై ఎక్కువ నియంత్రణ పెట్టదం లేదని అంటున్నారు. మెగా ఫ్యామిలీకి అభిమానులున్నారన్న ధైర్యమే ఈ సినిమాకి ఎక్కువ ఖర్చయినా ఫర్వాలేదని ఫీల్ అవుతున్నారట. మరేం జరుగుతుందో చూడాలి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: