కాజల్ అగర్వాల్ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికే 12 ఏళ్ళు దాటింది.  అయినప్పటికీ చందమామ ఎన్నో గొప్ప గొప్ప చిత్రాల్లో నటించి మెప్పించింది.  లక్ష్మి కళ్యాణం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు, మగధీర సినిమాలోని మిత్రవింద క్యారెక్టర్ తో అదరగొట్టింది.  ఆ తరువాత ఈ అమ్మడు చేసిన చందమామ సినిమా అదరహో అనిపించింది.  ఇలా ఒకటేమిటి టాప్ హీరోలందరితో సినిమాలు చేసి వావ్ అనిపించుకుంది.  

 


ఆ తరువాత ఇప్పుడు ఈ అమ్మడు చేసిన సినిమాలు కొంతకాలంగా ఫెయిల్ అవుతూ వస్తున్నాయి.  పోటీ పెరుగుతున్నా, అవకాశాలు దక్కించుకోవడంలో మాత్రం ఎప్పుడు కాజల్ ముందు ఉంటూనే ఉన్నది.  సినిమా పరంగా చూసుకున్నా కాజల్ పేరు అజరామరంగా మారిపోయింది.  కాజల్ కోసం చాలామంది దర్శక నిర్మాతలు ఎదురు చూస్తూనే ఉన్నారు.  కానీ, ఇక్కడ మరొక చిత్రం ఉన్నది. ఇక కాజల్ పెళ్లిపై అనేక పుకార్లు వస్తున్నాయి.  

 


వీటిని కాజల్ పెద్దగా పట్టించుకోవడం లేదు.  సినిమా రంగంతో పాటుగా ఈ అమ్మడు బిజినెస్ రంగంలో కూడా మెరుపులు మెరిపిస్తోంది.  ఇప్పటికే అనేక విషయాల్లో దూసుకుపోతున్న కాజల్, తాజాగా మరో విషయంలో కూడామెప్పించేందుకు సిద్ధం అయ్యింది.  అదేమంటే మేడం టుస్సాడ్ లో కాజల్ మైనపు విగ్రహం పెట్టబోతున్న సంగతి తెలిసిందే.  ఈ విగ్రహం కోసం అనేక అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

 


విగ్రహాం ఏర్పాటుకు ముహూర్తం కూడా నిర్ణయించారు.  ఈ నెల 5 వ తేదీన అక్కడ ప్రతిష్టించబోతున్నారట.  దీంతో కాజల్ ఖుషి అవుతున్నది.  టాలీవుడ్ నుంచి ఇప్పటికే ప్రభాస్,మహేష్ బాబు వంటి స్టార్స్ విగ్రహాలను మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో పెట్టారు.  హీరోయిన్ కేటగిరిలో కాజల్ మైనపు విగ్రహం పెట్టబోతున్నారు.  ఇది రియల్ గా సూపర్ అని చెప్పాలి.  అరుదైన గౌరవంగా చెప్పాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: