సూపర్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన అనుష్క తర్వాత స్టార్ హీరోల సరసన టాలీవుడ్, కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఈ అమ్మడు మొదట్లో గ్లామర్ తరహా పాత్రల్లో నటించి మెప్పించింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అరుంధతి మూవీతో ఈ అమ్మడి జాతం మారిపోయింది. లేడీ ఓరియెంట్ పాత్రల్లో నటించడం మొదలు పెట్టింది. రుద్రమదేవి, సైజ్ జీరో, భాగమతి లాంటి సినిమాల్లో నటించి స్టార్ హీరోల రేంజ్ లో విజయం అందుకుంది. గ్లామర్ పూర్తిగా వదిలేసి నటనకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టింది అనుష్క. భాగమతి తర్వతా చాలా గ్యాప్ తీసుకొని నిశ్శబ్దం మూవీలో నటిస్తుంది.
మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ మూవీలో మాధవన్ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ మూవీ పూర్తయి రిలీజ్ డేట్ విషయంలో ఎన్నో కాంట్రవర్సీలు ఎదురువుతున్నాయి. ‘కిల్ బిల్’ ఫేమ్ మైఖేల్ మ్యాడిసన్ నెగెటివ్ రోల్ పోషించారు.ఇక షాలినీ పాండే, అవసరాల శ్రీనివాస్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మూవీలో అనుష్క సాక్షి అనే చిత్రకారిణిగా, మాధవన్ మ్యుజిషియన్గా, అంజలి క్రైమ్ డిటెక్టివ్ ఏజెంట్గా కనిపించనున్నారు. జనవరి 31 విడుదల అవుతుందని అప్పట్లో అన్నప్పటికి, టెక్నికల్ సమస్యల వలన మూవీ వాయిదా పడింది. ఏప్రిల్ 2న ఈ మూవీ తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మలయాళ భాషలలో విడుదల కానుంది.
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో, కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థలు మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అయితే ఈ మూవీ ఇతర భాలషలలో సైలెన్స్ పేరుతో విడుదల కానున్న ఈ మూవీకి గోపి సుందర్ సంగీతం అందించారు. మరి ఈ మూవీతో అనుష్క ఎలా మెప్పిస్తుందో చూడాలి. కాకపోతే తెరపై అనుష్కను చూడ చాలా కాలం కావడంతో ఫ్యాన్స్ ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు.