ఏపీ రాజధాని గురించి అల్లర్లు అవుతున్న సంగతి తెలిసిందే. అమరావతి నుండి వైజాగ్కు మార్చాలని జగన్ యోచిస్తున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ అసెంబ్లీలో సీఎం జగన్ మండలిలో ఉన్న బిల్లును త్వరలోనే క్లియర్ కనిపిస్తుంది. ఇక ఈ విషయం పై చాలా సీరియస్గా ఉన్న జగన్ త్వరలోనే అధికారికంగా రాజధానులు ఏర్పాటు పై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. వైజాగ్ భూముల రేట్లకు రెక్కలు కూడా బాగా వచ్చేశాయి. చుట్టు పక్కల ఉన్న భూముల రేట్లు కూడా అమాంతం ఆకాశాన్నంటున్నాయి.
తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులు పలువురు వైజాగ్లో భూములు కలిగి ఉన్నారు. అందుకే వైజాగ్ను రాజధానిగా నిర్ణయించడంను సినీ వర్గాల వారు కూడా సమ్మతంగా ఉన్నారు. వైజాగ్లో అల్లు అరవింద్ ఫ్యామిలీకి పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంక్ ఉందట. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టినట్లు రియల్ గా వ్యాపారం చేయాలని అల్లు అరవింద్ పెద్ద కొడుకు అల్లు బాబీ భావిస్తున్నాడని సమాచారం.
అల్లు అరవింద్కి మాత్రమే కాకుండా మెగా ఫ్యామిలీ చిరుకి ఇంకా కొంత మంది సెలబ్రెటీలు కూడా పెద్ద ఎత్తున భూములు ఉన్నాయట. అక్కడ చేయబోయే రియల్ ఎస్టేట్ వ్యాపారం, కన్స్ట్రక్షన్ వ్యాపారం ఇలా మొత్తానికి చాలానే చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇక కోట్లల్లో విలువ చేసే భూములను కొనుగోలు చేసి విక్రయించడం వల్ల మరింతగా కలిసి వస్తుందని అంటారు. అందుకే అల్లు అరవింద్ రియల్ వ్యాపారం చేసేందుకు సిద్దం అయినట్లుగా సమాచారం అందుతోంది. మరి ఇది ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుంది. దీని గురించి మిగతా సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే అల్లుఅరవింద్ దాదాపు ఇప్పటి వరకు కూడా మంచి నిర్మాతగా మాత్రమే ఉన్నారు. మరి ఇప్పటి నుంచి ఈ కొత్త వ్యాపారం ఆయనకు ఏ విధంగా ఉండబోతుందో వేచి చూడాలి.